ఢిల్లీ కార్యక్రమానికి రాహుల్ గాంధీకి, ఏచూరిలకు ఆరెస్సెస్ ఆహ్వానం!
న్యూఢిల్లీ/నాగపూర్: కొద్ది నెలల క్రితం నాగపూర్లో జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆ సంస్థ ఆహ్వానించింది. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఢిల్లీలో జరగనున్న ఓ కార్యక్రమానికి అహ్వానించనున్నదని తెలుస్తోంది.
ఆరెస్సెస్ అంటేనే రాహుల్ గాంధీ అంతెత్తున లేస్తారు. రాజకీయంగా బీజేపీని విమర్శించే దాదాపు ప్రతి సందర్భంలో ఆరెస్సెస్ను లాగి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అలాంటి ఆరెస్సెస్ ఆయనను తమ కార్యక్రమానికి ఆహ్వానించనుండటం గమనార్హం.

సెప్టెంబర్ నెలలో 17 నుంచి 19 వరకు ఢిల్లీలో ఆరెస్సెస్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాహుల్తో పాటు సీతారాం ఏచూరి లాంటి ఇతర ప్రతిపక్ష నేతలను కూడా పిలవాలని ఆరెస్సెస్ భావిస్తోంది. భవిష్యత్తు భారత్పై ఈ కార్యక్రమంగా ప్రధానంగా దృష్టి సారించనుంది.
ఈ ఏడాది జూన్లో నాగ్పూర్లో జరిగిన కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీని ఆరెస్సెస్ ఆహ్వానించింది. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అసలు హాజరవుతారా లేదా అనే చర్చ సాగింది. ఆయన హాజరయ్యారు. మంచి సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీకే ఆహ్వానం పంపాలని ఆరెస్సెస్ భావిస్తుండటం గమనార్హం.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications