లొంగిన శశికళకు షాక్: సాధారణ ఖైదీగానే.. అమ్మ సెల్ నో..
శశికళ పరప్పణ అగ్రహార జైలులో ప్రత్యేక న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. ఆమె అమ్మ కారులోనే జైలుకు చేరుకున్నారు.
బెంగళూరు: కర్ణాటకలోని పరప్పణ అగ్రహారం జైలులో తనను గతంలో అమ్మ జయలలితకు కేటాయించిన సెల్ను కేటాయించాలని చిన్నమ్మ శశికళ కోరుతున్నారు. అమ్మ జయలలిత కారులోనే ఆమె చెన్నై నుంచి జైలుకు వచ్చారు. ఆమె కన్నా ముందే భర్త నటరాజన్, సీనియర్ నేత తంబిదురై జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. ఆమె వెంట కారులో రవి అనే శాసనసభ్యుడు ఉన్నారు.
ఆమె కారును దాదాపు వంద కారులు అనుసరించాయి. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించి అదనపు సదుపాయాలు కల్పించాలని ఆమె కోరుతున్నారు. అన్నాడియంకె ప్రధాన కార్యదర్శిగా ఆమెకు కొన్ని సదుపాయాలు మాత్రం కల్పించే అవకాశం ఉంది.

ప్రత్యేక కోర్టుకు రావాల్సిన అవసరం లేదని, పరప్పణ అగ్రహార జైలుకు నేరుగా రావాలని అధికారులు శశికళకు సూచించారు. బెంగళూరులోకి ప్రవేశించకుండా హైవేపై నుంచి జైలు ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అవసరమైతే న్యాయమూర్తి అక్కడికే వస్తారని అంటున్నారు.
శశికళ లొంగిపోతున్నారని, అందువల్ల అరెస్టు వారంట్ జారీ చేయవద్దని అంతకు ముందు ఆమె తరఫు న్యాయవాది కోరారు. దానికి కోర్టు అంగీకరించింది. తాను ఎక్కడ ఉన్నా మనసు మాత్రం జయలలిత సమాధి వద్దే ఉంటుందని ఆమె అన్నారు.
బుధవారం సాయంత్రం 5.10 గంటలకు జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. పెద్ద యెత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రత్యేక న్యాయమూర్తి సమక్షంలో శశికళ లొంగిపోయారు. ఇళవరిసి, సుధాకరన్ కూడా లొంగిపోయారు.
శశికళ మూడున్నరేళ్ల పాటు పరప్పణ అగ్రహార జైలులో ఉంటారు. ఇంతకు ముందు ఆమె ఆరు నెలలు జైలులో ఉన్నారు. దాంతో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించినప్పటికీ మూడున్నరేళ్లు ఉంటే సరిపోతుంది. శశికళను సాధారణ ఖైదీగానే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications