Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాయిబాబాపై స్వరూపానంద, వైదొలిగిన న్యాయమూర్తి

 Shankaracharya Swami Swaroopananda Saraswati's attack on Sai Baba reaches SC
న్యూఢిల్లీ: షిర్డీ సాయిబాబా పైన ఎవరు కూడా కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సాయిధామ్ ఛారిటబుల్ ట్రస్ట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సాయిధామ్ ఛారిటబుల్ ట్రస్ట్ షిర్డీ సాయిబాబా ఆలయం సహా మహారాష్ట్రలో అనేక ఆలయాలను నిర్వహిస్తోంది.

ఈ ట్రస్ట్ బుధవారం సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి, ఆయన అనుచరులు సాయిబాబా పైన ఎలాంటి ప్రకటనలు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది.

దేశంలో ఎక్కడా ఏ ఆలయంలో నుంచీ వారు బాబు ప్రతిమలను తొలగించకుండా చూడాలని కోరింది. బాబాకు వ్యతిరేకంగా స్వామి స్వరూపానంద సరస్వతి, ఆయన అనుచరులు కించపరిచే, అవమానకర పదజాలం వాడారని, వారి వ్యాఖ్యలతో దేశ, విదేశాల్లో ఉనన కోట్లమంది బాబా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది.

ఈ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదని తప్పుబట్టింది. కాగా, ఈ కేసును జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఎదుటకు వచ్చింది. కేసు విచారణ నుండి జస్టిస్ దవే వైదొలిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+