నేను సన్యాసిని, నాకు పద్మశ్రీ వద్దు: మోడీకి సిద్ధేశ్వర్ స్వామి లేఖ
బెంగళూరు: భారత ప్రభుత్వం తనకు ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును విజయ్పూర్కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సిద్ధేశ్వర్ స్వామిజీ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ ద్వరా విజ్ఞప్తి చేశారు.
తాను సన్యాసిని అని, తనకు అవార్డులు ఎందుకని పేర్కొన్నారు. 'ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును నాకు ఇవ్వాలని నిర్ణయించినందుకు భారత ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు. మీ పట్ల, భారత ప్రభుత్వం పట్ల ఎంతో గౌరవంతో అవార్డును స్వీకరించలేనని తెలియజేస్తున్నాను. మీరు నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని సిద్ధేశ్వర్ పేర్కొన్నారు.

తాను గతంలోనూ ఏ అవార్డు స్వీకరించలేదని సిద్ధేశ్వర్ స్పష్టం చేశారు. ధార్వాడ్ యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్ను కొన్నేళ్ల క్రితం ఇవ్వగా గౌరవపూర్వకంగా దానిని తిరిగి ఇచ్చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications