11 అదనం: ఆ విద్యార్థికి 100కు 101మార్కులొచ్చాయి
అహ్మదాబాద్: ఏ విద్యార్థి అయినా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ 100కు 101 మార్కులు సాధించడం సాధ్యమేనా? అయితే, సాఫ్టువేర్లోని పొరపాటు కారణంగా గుజరాత్లో పన్నెండో తరగతిలో ఓ విద్యార్థికి వందకు నూటా ఒక్క మార్కులు వచ్చాయి.
గుజరాత్ వెళ్లి గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులో ఇది జరిగింది. ఇంటర్ పరీక్షల్లో ఓ విద్యార్థి 100 మార్కులకు పరీక్ష రాస్తే అతనికి 101 మార్కులు వచ్చాయి. సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగిందని, తప్పు సరిదిద్దుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

జరిగిన నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణమైన వారికి నోటీసులు ఇచ్చామని, పరీక్షా పేపర్లు దిద్దిన ఔట్ సోర్సింగ్ ఏజన్సీదే తప్పని అధికారులు తెలిపారు. దీనిని సీరియస్గా తీసుకున్నామన్నారు. రాయాల్సిన సమాధానాల కన్నా, అధికంగా రాసిన ఓ విద్యార్థి వాస్తవానికి 90 మార్కులు తెచ్చుకుంటే, కంప్యూటర్ తప్పిదం కారణంగా 101 మార్కులు వచ్చాయని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
ఔట్ సోర్సింగ్ ఏజన్సీ ఉపయోగించిన సాఫ్టువేర్ విద్యార్థికి 11 మార్కులు అధికంగా వేసిందన్నారు. ఇలాగే ఎవరికైనా ఎక్కువ మార్కులు వచ్చాయా? అన్న విషయమై పరిశీలిస్తున్నామన్నారు. ఈ ఘటన తర్వాత గుజరాత్ టెక్నాలజీ యూనివర్శిటీకి చెందిన శ్రీ కంప్యూటర్స్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టును రద్దు చేశామన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications