ఏడాదిగా వెంట పడుతున్నాడు: ప్రేమించలేదని ఆమెపైకి కారు ఎక్కించాడు
కొచ్చి: ఓ ప్రేమోన్మాది కేరళలో అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఏడాది కాలంగా వెంటపడుతున్నా 22 ఏళ్ల అమ్మాయి అతన్ని పట్టించుకోవడం లేదు. దాంతో కక్ష పెంచుకున్న అతను అమ్మాయిపైకి కారు ఎక్కించాడు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని అరింబూర్లో ఆ సంఘటన చోటు చేసుకుంది. బికాం రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయిపై 21 ఏళ్ల షెబీన్ అనే యువకుడు ఆ దారుణానికి పాల్పడ్డాడు.
గుడికి వెళ్లి వస్తున్న సమయంలో అమ్మాయిపై అతను కారుతో దాడికి దిగాడు. ఆమెకు సహాయం చేసేందుకు వచ్ిచన మరో ఐదుగురిపైకి కూడా అతను కారు ఎక్కించాడు. కారు రివర్స్ తీసుకుని వచ్చి మరీ వారిని కారుతో గుద్దాడు. ఈ దాడిలో వారు గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో ఒకతను వెంటిలేటర్పై చికిత్స పొందుతుండగా, మరో వ్యక్తి ఐసియులో ఉన్నాడు. సంఘటన తర్వాత షెబిన్ తల్లిదండ్రులతో సహా పరారయ్యాడు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.