Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలర్ట్.. అలర్ట్.. అలర్ట్... ఎయిర్‌బేస్‌లపై ఉగ్రవాదుల దాడికి ఛాన్స్, అప్రమత్తం..

దసరా, దీపావళి పండగవేళ దేశంలో ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా భారత వాయుసేన కేంద్రాలపై ఆత్మాహుతి దాడి చేసే అవకాశం ఉందని డేంజర్ బెల్స్ మోగించాయి. ఐబీ అధికారుల ఆదేశంతో ఆయా ఎయిర్‌పోర్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

భారత్‌లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ అధికారులు హెచ్చరించారు. 10 మంది ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. జైషే ఉగ్రవాదులు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని తెలుపడంతో ఎయిర్ పోర్స్ విభాగం అప్రమత్తమైంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, అమృత్‌సర్, శ్రీనగర్, జమ్ముకశ్మీర్‌లోని వాయుసేన కేంద్రాలే టార్గెట్ అని పేర్కొన్నారు.

srinagar, amritsar aisbases high alert on terror attack !!

ఐబీ అధికారుల హెచ్చరికతో శ్రీనగర్, అవంతిపూర్, జమ్ము, పఠాన్‌కోట్, హిందాన్ విమాన స్థావరాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. రెడ్ అలర్ట్ కన్నా ముందు ఆరెంజ్ హెచ్చరిక ఇస్తారు. రెడ్ అలర్ట్ ఇస్తే ఆయా పరిధిలో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలను మూసివేస్తారు. బాలాకోట్ ఉగ్రవాద స్థావరమే కాదు అంతకన్నా ముందు వెళ్లి దాడులు చేస్తామని ఆర్మీ ఛీప్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించిన నేపథ్యంలో ఉగ్రవాద దాడులు చేయొచ్చనే నిఘావర్గాల అంచనా ప్రాధాన్యం సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+