అలర్ట్.. అలర్ట్.. అలర్ట్... ఎయిర్బేస్లపై ఉగ్రవాదుల దాడికి ఛాన్స్, అప్రమత్తం..
దసరా, దీపావళి పండగవేళ దేశంలో ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా భారత వాయుసేన కేంద్రాలపై ఆత్మాహుతి దాడి చేసే అవకాశం ఉందని డేంజర్ బెల్స్ మోగించాయి. ఐబీ అధికారుల ఆదేశంతో ఆయా ఎయిర్పోర్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
భారత్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ అధికారులు హెచ్చరించారు. 10 మంది ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. జైషే ఉగ్రవాదులు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని తెలుపడంతో ఎయిర్ పోర్స్ విభాగం అప్రమత్తమైంది. పంజాబ్లోని పఠాన్కోట్, అమృత్సర్, శ్రీనగర్, జమ్ముకశ్మీర్లోని వాయుసేన కేంద్రాలే టార్గెట్ అని పేర్కొన్నారు.

ఐబీ అధికారుల హెచ్చరికతో శ్రీనగర్, అవంతిపూర్, జమ్ము, పఠాన్కోట్, హిందాన్ విమాన స్థావరాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. రెడ్ అలర్ట్ కన్నా ముందు ఆరెంజ్ హెచ్చరిక ఇస్తారు. రెడ్ అలర్ట్ ఇస్తే ఆయా పరిధిలో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలను మూసివేస్తారు. బాలాకోట్ ఉగ్రవాద స్థావరమే కాదు అంతకన్నా ముందు వెళ్లి దాడులు చేస్తామని ఆర్మీ ఛీప్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించిన నేపథ్యంలో ఉగ్రవాద దాడులు చేయొచ్చనే నిఘావర్గాల అంచనా ప్రాధాన్యం సంతరించుకుంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications