15 రోజుల్లో ఆధార్ డీ లింక్ ప్లాన్ ఇవ్వండి: టెలికాం సంస్థలకు ఉడాయ్
న్యూఢిల్లీ: ఆధార్ను డీ లింక్ చేసే ప్లాన్ను పదిహేను రోజుల్లోగా ఇవ్వాలని భారత ఉడాయ్... టెలికాం సంస్థలను కోరింది. ఆధార్ను టెలికాం వినియోగదారుల గుర్తింపు కోసం ఉపయోగించడం నిలిపేయాలని తెలిపింది. మొబైల్ నంబర్లతో ఆధార్ అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని, బ్యాంకు ఖాతాలు, స్కూల్ అడ్మిషన్లకు కూడా ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు నాలుగు రోజుల క్రితం తీర్పు చెప్పింది.
టెలికాం సంస్థలు సహా ప్రయివేటు కంపెనీలు ఆధార్ నంబర్ అడగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఉడాయ్ భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా తదితర టెలికాం సేవల కంపెనీలకు సర్య్కులర్ను పంపింది. టెలికాం సంస్థలు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ వ్యవస్థలను నిలిపివేసే, ఆధార్ను డీ లింక్ చేసే ప్రణాళికలను అక్టోబరు 15లోగా ప్రణాళిక అందించాలని అడిగింది.

వ్యక్తుల ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్స్ ఉన్న ఆధార్ సమాచారాన్ని ప్రయివేటు కంపెనీలు డిమాండ్ చేయడానికి వీల్లేదని భారత అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అయితే ఆధార్ రాజ్యాంగ బద్ధమేనని కోర్టు స్పష్టంచేసింది.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications