అందరూ చూస్తుండగా రాళ్లతో కొట్టి చంపారు
చెన్నై: తమిళనాడు వెల్లూరు జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కొంత మంది రాళ్లతో కొట్టి చంపారు. అందరూ చూస్తుండగానే అతన్ని హత్య చేశారు. మృతుడి తల రక్తం మడుగులో కూరుకుపోయింది.
మృతుడిని మహాలింగంగా గుర్తించారు. అతని శవం రోడ్డు పక్కన పడి ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఫొటోగ్రాఫ్ల ఆధారంగా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తమిళనాడు రాజధాని చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో గల వెల్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
అనుమానితులు ఇంజనీరింగ్ కళాశాల యజమాని కుమారులని తెలుస్తోంది. ఓ ముఠాలో వారు భాగస్వాములని కూడా అంటున్నారు. వారి అంకల్ను రెండేళ్ల క్రితం చంపాడనే కక్షతో మహాలింగాన్ని వారు హతమార్చినట్లు భావిస్తున్నారు.
మృతుడు ఆ ప్రాంతంలో పేరు మోసిన నేరగాడని, అతనిపై ఆరు హత్య కేసులున్నాయని, బెయిల్పై విడుదలయ్యాడని పోలీసులు అంటున్నారు.