చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందరూ చూస్తుండగా రాళ్లతో కొట్టి చంపారు

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు వెల్లూరు జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కొంత మంది రాళ్లతో కొట్టి చంపారు. అందరూ చూస్తుండగానే అతన్ని హత్య చేశారు. మృతుడి తల రక్తం మడుగులో కూరుకుపోయింది.

మృతుడిని మహాలింగంగా గుర్తించారు. అతని శవం రోడ్డు పక్కన పడి ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఫొటోగ్రాఫ్‌ల ఆధారంగా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తమిళనాడు రాజధాని చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో గల వెల్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Tamil Nadu Brothers Arrested After Gory Pictures of Alleged Murder

అనుమానితులు ఇంజనీరింగ్ కళాశాల యజమాని కుమారులని తెలుస్తోంది. ఓ ముఠాలో వారు భాగస్వాములని కూడా అంటున్నారు. వారి అంకల్‌ను రెండేళ్ల క్రితం చంపాడనే కక్షతో మహాలింగాన్ని వారు హతమార్చినట్లు భావిస్తున్నారు.

మృతుడు ఆ ప్రాంతంలో పేరు మోసిన నేరగాడని, అతనిపై ఆరు హత్య కేసులున్నాయని, బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసులు అంటున్నారు.

English summary
Armed with rocks, two men stand above a bleeding man, poised to strike the next blow. His head is pooled in blood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X