దటీజ్ జయలలిత

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత సోమవారం మరణించారు. జయలలిత 1948 ఫిబ్రవరి 24వ తేదీన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని మేలుకోటేలో జన్మించారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత సోమవారం ఉదయం 11.30 గంటలకు గుండెపోటుతో మరణించారు. జయలలిత చికిత్స విఫలమై మరణించాని సోమవారం అర్దరాత్రి 12.10 గంటలకు అపోలో, అన్నాడీఎంకే వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రస్తుతం తమిళనాడులో విషాదచాయలు నెలకొన్నాయి.

జయలలిత 1948 ఫిబ్రవరి 24వ తేదీన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని పాండవపుర తాలుకాలోని మేలుకోటేలో జన్మించారు. అక్కడి నుంచి అంచలంచెలుగా పైకి వచ్చి నేడు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.

నిత్యం పేద ప్రజల కోసం పరితపించే జయలలిత చివరికి ముఖ్యమంత్రి హోదాలోనే అనారోగ్యానికి గురై పరలోకాలకు వెళ్లిపోయారు. అమ్మలేని జీవితం మేము ఊహించుకోలేమని తమిళనాడు ప్రజలు బోరున విలపిస్తున్నారు.

Tamil Nadu CM Jayalalithaa died

అన్నాడీఎంకే నాయకులు సైతం అమ్మ ఫోటోలు చేతపట్టుకుని విషాదంలో మునిగిపోయారు. ఇక మాకు ఎవరు దిక్కు అమ్మా అంటూ బిక్కుబిక్కున ఏడుస్తున్నారు. తమిళనాడుతో పాటు దేశం మొత్తం ఉన్న జయలలిత అభిమానులు మంగళవారం శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.

అమ్మ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె అభిమానులు తమిళనాడులోని వివిద జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫ్లక్సీలు, హోడ్డింగ్స్ ధ్వంసం చేశారు. జయలలిత అభిమానులు సహనం కోల్పోయి ఆందోళనలు చెయ్యడంతో పోలీసులు హడలిపోతున్నారు. పరిస్థితిని అదుపు చెయ్యడానికి పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+