తమిళనాడు సర్కార్ సంచలనం: పురచ్చితలైవి జయలలిత నివాసం స్వాధీనం: ఇకపై అది..
చెన్నై: దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకురాలు పురచ్చితలైవి జయలలిత. తమిళనాడులో వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకున్న ఆమె ఎంతో కాలం జీవించలేకపోయారు. ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే అనారోగ్యానికి గురయ్యారు. సుమారు 70 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తమిళనాడు రాజకీయాల్లో విప్లవ నాయకురాలిగా నిలిచిపోయారు.
తాజాగా- జయలలిత విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. చెన్నైలో జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్స్ బంగళా వేద ఇళ్లంను స్వాధీనం చేసుకుంది. ఈ దిశగా శుక్రవారం ఆర్డినెన్స్ వెలువడింది. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఈ ఆర్డినెన్స్ను జారీ చేశారు. ఈ బంగళా ప్రభుత్వ వశం చేయడానికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన ఆమోదం తెలిపారు. ఈ బంగళాలో ఉన్న వస్తువులన్నీ యధాతథంగా ప్రభుత్వానికి చెందుతాయని పేర్కొన్నారు.

ఇకపై ఆ బంగళాను జయలలిత స్మారక మ్యూజియంగా మార్చడానికి తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. జయలలితకు సంబంధించిన ఫొటోలు, పూర్తి సమాచారాన్ని ఇందులో భద్రపరుస్తారని తెలుస్తోంది. జయలలిత విద్యాభ్యాసం మొదలుకుని సినిమాల్లోకి అడుగు పెట్టడం, అనంతరం రాజకీయాల్లో ప్రవేశించడం.. పురచ్చితలైవిగా ఆవిర్భవించిన ప్రధాన ఘట్టాలతో కూడిన ఫొటోలు, వినియోగించిన వస్తువులను కూడా స్మారక మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారని తెలుస్తోంది.
చాలాకాలం పాటు జయలలిత పోయెస్ గార్డెన్స్ బంగళాలో నివాసం ఉన్నారు. సినీ, రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ఆరంభమైంది. 2016 సెప్టెంబర్లో ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరేంత వరకూ జయలలిత ఇదే బంగళాలో నివాసం ఉన్నారు. ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన తరువాత పార్థివ దేహాన్ని మొదట ఈ బంగళాకే తీసుకొచ్చారు. అనంతరం అభిమానుల కోసం టౌన్హాల్లో ఉంచారు. జయలలిత మరణించిన తరువాత ఆమె సన్నిహితురాలు శశికళ ఆ ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు. ఆస్తుల కేసులో ఆమె అరెస్టయిన తరువాత ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది.
Recommended Video
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications