ఎయిర్ ఇండియాలో అన్నం, పప్పు, గరం చాయ్
ముంబై: ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రయాణికులకు భారతీయ వంటకాలను రుచి చూపించేందుకు సర్వం సిద్దం చేసింది. ఇప్పటికే ముంబై - న్యూఢిల్లీ మార్గంలో సంచరిస్తున్న ఎయిర్ ఇండియా విమానాల్లో ఈ కొత్త మెనును అందుబాటులోకి తీసుకువచ్చారు.
భారతీయుల సాధారణ భోజనం తాలీ, కుల్హద్ మసాలా చాయ్ లను ప్రయాణికులకు అందిస్తున్నారు. ప్రయాణికులకు అన్నం, పప్పు వడ్డిస్తున్న తొలి విమాన సర్వీసుగా ఎయిర్ ఇండియా సంస్థ నిలిచింది.
సోమవారం నుంచి ప్రారంభమైన ఈ మెనుపై ఇప్పటికే మంచి స్పందన వస్తున్నదని ఎయిర్ ఇండియా ఎండీ అశ్వని లోహాని తెలిపారు. ప్రయాణికుల స్పందన, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని అతి త్వరలో మిగతా సర్వీసులకు ఈ మెను విస్తరిస్తామని చెప్పారు.

తాలీలో భాగంగా అన్నం, పప్పు, ఓ కూర, రోటీ, పనీర్ లేదా చికెన్, పెరుగుతో పాటు మొత్తం ఏడు ఫుడ్ ఐటమ్స్ ఎంచుకునే వీలు ఉందని ఆయన వివరించారు. సాధారణంగా ఫ్లైట్ లో అందించే భోజనం కంటే తాలీని వేడి వేడిగా వడ్డించేందుకు కాస్త సమయం పడుతుందని క్రూ మెంబర్లు అంటున్నారు.
సాధారణంగా బిజినెస్ క్లాస్ లో అందించే భోజన పదార్థాలు ఒకే సారి వేడి చేసే వీలుంది. తాలీలో మాత్రం అన్ని పదార్థాలు వేరు వేరుగా వేడిచేయాల్సి వస్తుందని వారు అంటున్నారు. మొత్తం మీద ఎయిర్ ఇండియా విమానంలో అన్నం, పప్పు వడ్డించడంతో భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications