లోకాయుక్త రూ. కోటి లంచం కేసు: భాస్కర్ అరెస్టు
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త లో రూ. కోటి లంచం డిమాండ్ చేసిన కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు (ఎస్ఐటి) మరొ వ్యక్తిని అరెస్టు చేశారు. లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ కు పర్సనల్ సెక్రటరిగా చెప్పుకుని తిరిగిన వి. భాస్కర్ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేశారు.
గురువారం భాస్కర్ ను లోకాయుక్త కోర్టు ముందు హాజరు పరుస్తామని ప్రత్యేక బృందం అధికారులు తెలిపారు. అయితే వి. భాస్కర్ ను కర్ణాటకలో అరెస్టు చేశారా, తెలంగాణలో అరెస్టు చేశారా అని మాత్రం అధికారులు వెల్లడించలేదు.
చిత్రదుర్గలో నీటి పారుదల శాఖలో ఇంజనీరుగా పని చేస్తున్న చెన్నబసప్పను లంచం ఇవ్వాలని భాస్కర్ బెదిరించాడు. తాను అశ్విన్ రావ్ పీఏనంటూ చెన్నబసప్పను పరిచయం చేసుకున్నాడు. చెన్న బసప్ప ఫిర్యాదు చెయ్యడంతో కేసును సిట్ అధికారులకు బదిలి చేశారు.

రూ. కోటి లంచం కేసులో అరెస్టు అయిన అశ్విన్ రావ్, అశోక్ కుమార్, శంకర్ గౌడ, శ్రీనివాస్ గౌడలను ఈ నెల 14వ తేది వరకు రిమాండ్ కు తరలించారు. వారి బెయిల్ అర్జీ విచారణ అదే రోజు జరుగనుంది. బుధవారం సయ్యద్ రియాజ్ బెయిల్ అర్జీ విచారణ పూర్తి అయ్యింది.
ఈనెల 14వ తేదిన తీర్పు చెబుతామని న్యాయస్థానం చెప్పింది. సయ్యద్ రియాజ్ ను రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు చేస్తారని సిట్ అధికారులు అంటున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications