లోకాయుక్త రూ. కోటి లంచం కేసు: భాస్కర్ అరెస్టు
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త లో రూ. కోటి లంచం డిమాండ్ చేసిన కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు (ఎస్ఐటి) మరొ వ్యక్తిని అరెస్టు చేశారు. లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ కు పర్సనల్ సెక్రటరిగా చెప్పుకుని తిరిగిన వి. భాస్కర్ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేశారు.
గురువారం భాస్కర్ ను లోకాయుక్త కోర్టు ముందు హాజరు పరుస్తామని ప్రత్యేక బృందం అధికారులు తెలిపారు. అయితే వి. భాస్కర్ ను కర్ణాటకలో అరెస్టు చేశారా, తెలంగాణలో అరెస్టు చేశారా అని మాత్రం అధికారులు వెల్లడించలేదు.
చిత్రదుర్గలో నీటి పారుదల శాఖలో ఇంజనీరుగా పని చేస్తున్న చెన్నబసప్పను లంచం ఇవ్వాలని భాస్కర్ బెదిరించాడు. తాను అశ్విన్ రావ్ పీఏనంటూ చెన్నబసప్పను పరిచయం చేసుకున్నాడు. చెన్న బసప్ప ఫిర్యాదు చెయ్యడంతో కేసును సిట్ అధికారులకు బదిలి చేశారు.

రూ. కోటి లంచం కేసులో అరెస్టు అయిన అశ్విన్ రావ్, అశోక్ కుమార్, శంకర్ గౌడ, శ్రీనివాస్ గౌడలను ఈ నెల 14వ తేది వరకు రిమాండ్ కు తరలించారు. వారి బెయిల్ అర్జీ విచారణ అదే రోజు జరుగనుంది. బుధవారం సయ్యద్ రియాజ్ బెయిల్ అర్జీ విచారణ పూర్తి అయ్యింది.
ఈనెల 14వ తేదిన తీర్పు చెబుతామని న్యాయస్థానం చెప్పింది. సయ్యద్ రియాజ్ ను రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు చేస్తారని సిట్ అధికారులు అంటున్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications