రియాల్టీ షో పిచ్చి: బాలుడిని చంపేశారు
న్యూఢిల్లీ: రియాల్టీ షో లో పాల్గోనేందుకు ఇద్దరు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. బాలుడిని నమ్మించి తీసుకు వెళ్లి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కొండ మీద నుంచి కిందకు విసిరేశారు. ప్రస్తుతం ఇద్దరు మైనర్లను పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.
ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి రాంధ్వా చెప్పిన సమాచారం మేరకు వివరాలు ఈ విదంగా ఉన్నాయి. 17 ఏళ్ల అమ్మాయి, అబ్బాయి రియాల్టీ షోలో పాల్గోనడానికి ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముంబై వెళ్లడానికి వీరికి డబ్బు అవసరం అయ్యింది.
తరువాత స్వప్నేష్ (13) అనే బాలుడిని డ్యాన్స్ షో కు వెళదామని నమ్మించి తీసుకు వెళ్లారు. సెప్టెంబర్ 16వ తేదిని ఉత్తరాఖండ్ తీసుకెళ్లారు. అక్కడ ఒక రాత్రి స్నేహితుడి ఇంట్లో వీరు ముగ్గురూ తలదాచుకున్నారు.
మరుసటి రోజు బాలుడిని పిలుచుకుని రాణిఖేత్ కొండ మీదకు వెళ్లారు. కొండ మీద బెల్ట్ తీసుకుని స్వప్నేష్ గొంతు బిగించి ఊపిరిరాకుండా చేసి హత్య చేశారు. ఇద్దరూ కలిసి స్వప్నేష్ మృతదేహాన్ని కొండ మీద నుంచి కిందకు విసిరేశారు.
రెండు రోజుల తరువాత ఇద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. మీ కుమారుడిని అప్పగించాలంటే రూ. 60 వేలు ఇవ్వాలని స్వప్నేష్ తండ్రిని బెదిరించారు. బాధితుడు ఫిర్యాదు చెయ్యడంతో రంగంలో దిగిన పోలీసులు మైనర్ల ఫోన్ నెంబర్ల ఆదారంగా అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.