UP: మాకు దేశమే కుటుంబం, ప్రజలే కుటుంబసభ్యులు: ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ కౌంటర్

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో బుధవారం జరిగిన విశాల్ జనసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. రాష్ట్రంలో 59 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్న నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, యూపీలో ప్రధాన పార్టీలు బీజేపీ, ఎస్పీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

వారసత్వ పార్టీలతో పేదలకు ప్రయోజనాలు దక్కవు: ప్రధాని మోడీ

వారసత్వ పార్టీలతో పేదలకు ప్రయోజనాలు దక్కవు: ప్రధాని మోడీ

పరివార్డీస్(వారసత్వం).. పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు దక్కనీయరని ప్రధాని మోడీ అన్నారు. వారసత్వ రాజకీయం చేసేవారు పేదలను పేదలుగానే ఉండాలని కోరుకుంటారని, ఎప్పటికీ వారి చుట్టే తిరగాలని కోరుకుంటారన్నారు. అందుకే ఇప్పుడు పేద ప్రజలంతా బీజేపీతోనే ఉన్నారని, బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని మోడీ చెప్పారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. యూపీని శక్తివంతం చేసేందుకు 10 కోట్ల మందికిపైగా కూతుళ్లు, సోదరీమణులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఒకవేళ మేము మా అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల బంధంలో ఉండిపోతే, యూపీ వేగవంతమైన అభివృద్ధిని సాధించదన్నారు.

వారసత్వ నేతలకు వారి కుటుంబమే తప్ప పేద ప్రజల బాధలు పట్టవు


వారసత్వ రాజకీయాలు చేసేవారు వారి కుటుంబాన్ని తప్ప పేద ప్రజల అభివృద్ధిని కోరుకోవడం లేదన్నారు. కుటుంబం ఉన్న ముస్లిం కూతుళ్ల బాధలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు ప్రధాని మోడీ. వివాహమైన తర్వాత కూడా వారు తమ పిల్లలతో పుట్టింటికి ఎందుకు చేరుకుంటున్నారని నిలదీశారు. వారి బాధలను ఈ కుటుంబ రాజకీయాలు చేసేవారు ఎందుకు పట్టించుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం పోలీసు శాఖలో కూతుళ్ల సంఖ్యను పెంచిందని, అలాగే పారామిలటరీ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సైన్యంలోనూ వారి సంఖ్యను విస్తరించిందని ప్రధాని మోడీ తెలిపారు. యూపీలో యోగి అధికారంలోకి రాకముందు 11,000 మంది మాత్రమే ఉన్న మహిళా పోలీసు అధికారుల సంఖ్య 1.25 లక్షలకు పైగా పెరిగిందని ప్రధాని అన్నారు. 20,000 మందికి పైగా మహిళలను పోలీసు శాఖలో నియమించారు. బీఎస్ఎఫ్, పారామిలటరీ బలగాల్లో కూడా మహిళలను చేర్చుకుంటున్నారు.

మాకు దేశమే కుటుంబం, ప్రజలు కుటుంబసభ్యులు: ప్రధాని మోడీ

గత ప్రభుత్వాలపై దాడి చేస్తూ.. 'పరివార్‌వాడీలు' ఓటుకు నోటు మాత్రమే చూస్తారని, ఎవరి బాధను చూడలేదన్నారు. "మేము 'పరివార్ వాలా' కాదు, కానీ మేము అన్ని కుటుంబాల బాధను గుర్తిస్తాము ఎందుకంటే మొత్తం భారతదేశం మా కుటుంబం, మొత్తం ఉత్తరప్రదేశ్ నా కుటుంబం, మీరందరూ నా కుటుంబ సభ్యులు." అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అయినప్పటికీ, తన ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ప్రయోజనాలను అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలు చాలా వరకు మహిళల పేరుతోనే నమోదయ్యాయని ఆయన తెలిపారు. గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు, సరైన విద్యుత్, నీటి సరఫరాలను అందించింది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని వ్యాఖ్యానించారు.

బీజేపీతోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యం: ప్రధాని మోడీ


ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుతూ.. ఈ పద్ధతిని నేరంగా పరిగణించడం వల్ల ముస్లిం మహిళలకే కాకుండా వారి కుటుంబాలకు కూడా భద్రత లభిస్తుందని అన్నారు. రాష్ట్ర రైతుల గురించి మాట్లాడుతూ.. చిన్న, భూమి లేని రైతుల గురించి మాట్లాడింది కేవలం బీజేపీ ప్రభుత్వమేనన్నారు ప్రధాని మోడీ. పీఎం కిసాన్ పథకం ద్వారా కేవలం బారాబంకిలో దాదాపు 5 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రూ. 800 కోట్లు వెచ్చించామని మోడీ తెలిపారు. రాష్ట్రంలో నెలకొల్పుతున్న బయోగ్యాస్ ప్లాంట్ల వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుందని, తద్వారా పేడ విక్రయించడం ద్వారా వారి ఆదాయాలు పెరుగుతాయని, ఎరువుల ఖర్చు తగ్గుతుందని ప్రధాని మోడీ అన్నారు.పశువులను వివిధ వ్యాధుల నుంచి రక్షించేందుకు దాదాపు రూ.13 వేల కోట్లతో వ్యాక్సిన్‌ వేయడంపై దృష్టి సారించింది తమ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు దశల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేడు నాలుగో దశ పోలింగ్ ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల చివరి దశ మార్చి 7న నిర్వహించి, ఎన్నికల ఫలితాలు 2022 మార్చి 10న వెల్లడికానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+