వేగంగా వస్తున్న రైలు కింద దూకాడు(వీడియో)
ముంబై: ఓ ముప్పై ఏళ్ల వ్యక్తి వేగంగా వస్తున్న లోకల్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రంలోని ముంబై శివారు దహిసర్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. అతని చర్యకు ఒక్కసారిగా అక్కడున్నవారంతా దిగ్ర్భాంతికి గురయ్యారు.
కాగా, రైల్వే స్టేషన్లో సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటన ప్లాట్ ఫాం నెంబర్ 1పై మార్చి 30న ఉదయం 8.13గంటలకు చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటన సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు మంగళవారం మీడియాకు తెలిపారు.
ఈ వీడియో వైరల్ అవడంతో ప్రజల్లోకి వెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రైలు వేగంగా వస్తున్న తరుణంలో ఒక్కసారిగా బాధితుడు ఒక్కసారిగా రైలు కింద దూకి ప్రాణాలు తీసుకున్నాడని బోరివలి జీఆర్పీ అధికారి తెలిపారు.
మృతుడిని ముఖ్తార్ షేక్గా గుర్తించిన ట్లు చెప్పారు. తెలుపు రంగు షర్ట్, నలుపు ప్యాంట్ వేసుకున్నాడని తెలిపారు. బోరివలికి చెందిన షేక్.. పెయింటర్గా విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు.
{video1}













Click it and Unblock the Notifications