చెంప చెళ్లుమనిపించాడు: ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్కాంత్..
వివాదస్పద రీతిలో వార్తల్లోకి ఎక్కడం డీఎండీకె అధినేత విజయ్ కాంత్ కు ఈమధ్య కామన్ అయిపోయింది. గతేడాది ఎన్నికల ప్రచారం సందర్బంగా.. కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ కాంత్ .
చెన్నై: వివాదస్పద రీతిలో వార్తల్లోకి ఎక్కడం డీఎండీకె అధినేత విజయ్ కాంత్ కు ఈమధ్య కామన్ అయిపోయింది. గతేడాది ఎన్నికల ప్రచారం సందర్బంగా.. కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ కాంత్ వారిని చెంపదెబ్బ కొడుతానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇదే తరహా సీన్ మళ్లీ రిపీట్ అయింది. అయితే ఈసారి డీఎండీకె కార్యకర్త పైనే ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాదు, అందరిముందు సదరు కార్యకర్త చెంప చెళ్లుమనిపించడంతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంతకీ ఆ కార్యకర్త చేసిన తప్పిదమేంటంటే.. జిందాబాద్ బదులు వర్ధిల్లాలి అని పలకడమే.

తమిళనాడులోని పెరంబళూరులో శుక్రవారం నాడు డీఎండీకే ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీతో నేను' అనే కార్యక్రమంలో విజయ్ కాంత్ ఇలా ప్రవర్తించారు. అప్పటిదాకా కార్యకర్తల సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విజయ్ కాంత్.. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి బయటకు నడవడం మొదలుపెట్టారు.
ఇంతలో విజయ్కాంత్ కు ఎదురుపడ్డ ఓ కార్యకర్త 'విజయకాంత్ వర్దిల్లాలి' అంటూ గట్టిగా నినదించాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన విజయ్ కాంత్ కార్యకర్త చెంప చెళ్లుమనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications