జయలలిత ఎస్టేట్ లో హత్య: రెండు జీపుల్లో దర్జాగా ఎస్కేప్, సీసీ కెమెరాల్లో!
జయలలిత కొడనాడు ఎస్టేట్ లోకి రెండు జీపుల్లో వెళ్లిన దుండగులు అక్కడ సెక్యూరిటీ గార్డును హత్య చేసి చోరీ చేసి వెళ్లారని సమీపంలోని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డును హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొడనాడుతో పాటు కోయంబత్తూరు నగరం పరిసర ప్రాంతాల్లో పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.
సోమవారం వేకువ జామున జయలలిత కొడనాడు ఎస్టేట్ లో చోరబడిన దుండగులు అక్కడ పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ ను అతి దారుణంగా హత్య చేశారు. తరువాత బంగ్లాలో చోరీ చేసి అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

గ్రామస్తులు
కొడనాడు ఎస్టేట్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గ్రామస్తులను పోలీసు అధికారులు విచారిస్తున్నారు. పలువురు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించిన పోలీసు అధికారులు ఆ సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

హత్య చేసిన తరువాత
జయలలిత కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ ను హత్య చేసిన నిందితులు అక్కడ ఎలాంటి సాక్షాలు చిక్కకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు అంటున్నారు. అయితే సంఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

రెండు జీపుల్లో వచ్చారని
జయలలిత కొడనాడు ఎస్టేట్ లోపలినుంచి రెండు బోలెరో జీపుల్లో దుండగులు బయటకు వచ్చారని సమీపంలోని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు దుండగుల కోసం గాలిస్తున్నారు.

సీసీ కెమెరాల్లో
జయలలిత కొడనాడు ఎస్టేట్ లోని సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాల్లో స్థానికులు ఏర్పాటు చేసుకున్న సీసీకెమెరాల్లోని క్లిప్పింగ్స్ ను పోలీసులు పరిశీలించారు. సీసీకెమెరాల్లోని క్లిప్పింగ్స్ ఆధారంగా దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కోయంబత్తూరులో దుండగులు ?
జయలలిత కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హత్య చేసి చోరీ చేసిన దుండగులు కోయంబత్తూరులో తలదాచుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు నగరం మొత్తం జల్లెడపడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications