మీరు వస్తేనే: పఠాన్కోట్ దాడిపై మోడీకి షిండే నిలదీత
న్యూఢిల్లీ: పఠాన్కోట్ తీవ్రవాద దాడి విషయమై కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే బుధవారం స్పందించారు. బిజెపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు తీవ్రవాద దాడులు ఎక్కువవుతాయని ఆరోపించారు.
పంజాబ్లోని పఠాన్కోట్ ఏరియల్ బేస్ పైన జరిగిన ఉగ్రదాడి ఘటనకు బాధ్యులు ఎవరో చెప్పాలని షిండే ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశారు. భద్రత వైఫల్యానికి కారణం చెప్పాలన్నారు. పఠాన్కోట్ ఘటనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దేశాన్ని కాపాడే పటిష్ఠమైన భద్రత వ్యవస్థ లేదని ఆరోపించారు.

1999లో విమానం హైజాక్కు గురైతే మన వాళ్లను విడిపించేందుకు తీవ్రవాదులను జైలు నుంచి విడిపించవలసి వచ్చిందన్నారు. అందులో మసూద్ అజహర్ కూడా ఉన్నారన్నారు. ఆ తర్వాత పలు సంఘటనలు జరిగాయన్నారు.
ఇప్పటికే పఠాన్కోట్ ఘటన నేపథ్యంలో హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో నాలుగు రోజుల ఆపరేషన్ నిర్వహించి ఆరుగురు ఉగ్రవాదులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications