మీరు వస్తేనే: పఠాన్కోట్ దాడిపై మోడీకి షిండే నిలదీత
న్యూఢిల్లీ: పఠాన్కోట్ తీవ్రవాద దాడి విషయమై కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే బుధవారం స్పందించారు. బిజెపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు తీవ్రవాద దాడులు ఎక్కువవుతాయని ఆరోపించారు.
పంజాబ్లోని పఠాన్కోట్ ఏరియల్ బేస్ పైన జరిగిన ఉగ్రదాడి ఘటనకు బాధ్యులు ఎవరో చెప్పాలని షిండే ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశారు. భద్రత వైఫల్యానికి కారణం చెప్పాలన్నారు. పఠాన్కోట్ ఘటనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దేశాన్ని కాపాడే పటిష్ఠమైన భద్రత వ్యవస్థ లేదని ఆరోపించారు.

1999లో విమానం హైజాక్కు గురైతే మన వాళ్లను విడిపించేందుకు తీవ్రవాదులను జైలు నుంచి విడిపించవలసి వచ్చిందన్నారు. అందులో మసూద్ అజహర్ కూడా ఉన్నారన్నారు. ఆ తర్వాత పలు సంఘటనలు జరిగాయన్నారు.
ఇప్పటికే పఠాన్కోట్ ఘటన నేపథ్యంలో హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో నాలుగు రోజుల ఆపరేషన్ నిర్వహించి ఆరుగురు ఉగ్రవాదులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications