రైతు కుటుంబం నుంచి తమిళ సీఎం వరకు: ఎవరీ పళనిస్వామి?
తమిళనాడులో గత వారం రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
చెన్నై: తమిళనాడులో గత వారం రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. పళనిస్వామి దివంగత సీఎం జయలలితకు కూడా నమ్మకస్తుడే కావడం గమనార్హం. రైతు కుటుంబం నుంచి వచ్చిన పళనిస్వామి.. అనూహ్యంగా రీతిలో ముఖ్యమంత్రిగా తెరపైకి రావడం వెనక అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళే ఉన్నారు.
పళనిస్వామి ప్రస్తానం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. అన్నాడీఎంకే సీనియర్ నేతల్లో ఒకరైన పళనిస్వామి..సేలం జిల్లా సిరువన్పాలెం ప్రాంతంలోని రైతు కుటుంబానికి చెందినవారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే చీలిక వచ్చినప్పుడు జయలలిత పక్షాన చేరారు.
1989లో జయలలిత వర్గం నుంచి కోడిపుంజు గుర్తుపై ఎడప్పాడి నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1991, 2011, 2016 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2011లో జయలలిత మంత్రివర్గంలో రహదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో ప్రజాపనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న పళనిస్వామికి గతంలోనూ సీఎం పీఠం దక్కినట్లే దక్కి దూరమైంది. జయలలిత మరణానంతరమే ముఖ్యమంత్రిగా పళనిస్వామిని నియమించాలని శశికళ గట్టి ప్రయత్నాలే చేయగా శాసనసభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరదన్న భావనతో పన్నీరుసెల్వాన్ని నియమించారు.
అనంతరం పార్టీలో తలెత్తిన సంక్షోభాల నడుమ శశికళే ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చారు. అక్రమాస్తుల కేసుల్లో జైలుకెళ్లినా తనకు నమ్మకస్తుడైన వ్యక్తినే సీఎం చేసి శశికళ పంతం నెగ్గించుకున్నారని అన్నాడీఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా పళనిస్వామి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం అనుకోని రాజకీయ పరిణామమనే చెప్పవచ్చు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications