ఆమెకు రెండో భర్త ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఉత్తర్ ప్రదేశ్: ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ రెండో భర్త ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తనకు రక్షణగా ఆమె దాన్నిరెండో భర్తగా ఎంచుకొంది. ఆమె తీసుకొన్న నిర్ణయం ఆమె కుటుంబాన్ని రక్షిస్తోంంది. భర్త లేకున్నా తన కుటుంబాన్ని రెండో భర్త సహాయంతో రక్షిస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ కు చెందిన షహానా బేగం కు మరో పేరు కూడ ఉంది. తుపాకీ చిన్నమ్మగా స్థానికులు ఆమెను పిలుస్తారు.ఆమెకు నలుగురు పిల్లలు.ఇందులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు.పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కుటుంబ తగాదాల్లో ఆమె భర్తను అతని సోదరుడే తుపాకితో కాల్చాడు. దీంతో ఆయన చనిపోయాడు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నారు. తనతో పాటు తన కుటుంబానికి రక్షణ అవసరమని ఆమె భావించారు.
తన కుటుంబానికి రక్షణ ఎవరూ కల్పించరని తానే రక్షణ కల్పించుకోవాల్సిన పరిస్థితులున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.పోలీసులకు చెప్పినా అంతగా ప్రయోజనం ఉండదని ఆమె అనుకొన్నారు. అందుకే తనకు తుపాకీ అవసరమని భావించారు. తుపాకీ లైసెన్సు కోసం దరఖాస్తు చేశారు ఈ కుటుంబానికి తుపాకీలు కొత్త కాదు. అత్తవరింట్లోనూ, పుట్టింట్లోనూ తుపాకులు వాడేవారు. దీంతో సులభంగానే ఆమెకు తుపాకీ లైసెన్స్ వచ్చింది.

ఆమెకు రెండో భర్తే తుపాకీ.
లైసెన్స్ వచ్చిన తర్వాత 15 వేల రూపాయాలతో ఆమె తుపాకీని కొనుగోలు చేసింది. ఈ తుపాకీనే ఆమె రెండో భర్తగా భావిస్తున్నారు.తుపాకీయే ఆదారంగా ఆమె భావిస్తారు. తుపాకీని ఆమె అన్నిసమయాల్లో తన వద్దే ఉంచుకొంటుంది. తుపాకీని కొనుగోలు చేసిన ఆమె తన వ్యవసాయబూమిలో రహాస్యంగా తుపాకీని కాల్చడం నేర్చుకొన్నారు.ఆమె దగ్గర తుపాకీ ఉన్న విషయం స్థానికులకు తెలిసింది. అయితే స్థానికంగా సమస్యల పరిష్కారం కోసం ఆమె వద్ద తుపాకీ ఉండడం ఆమెకు కలిసి వచ్చింది.
గ్రామానికి చెందిన మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆమెను ఆశ్రయించేవారు. ఆమె ఈ సమస్యలను చిటికెలో పరిష్కరించేవారు. ఓ యువతిని రెండు రోజులపాటు నలగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ ఘటన 2013 లో చోటుచేసుకొంది.నిందితులను షహానాబేగం పోలీసులకు పట్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడితో బాదితురాలికి వివాహం జరిగేలా ఆమె కృషిచేసింది.తన కుటుంబం రక్షణ కోసం కొనుగోలు చేసిన తుపాకితో ఇంతవరకు ఎవరినీ కాల్చలేదుని ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications