షాక్: షీనాబోరా హత్యకేసును విచారిస్తున్న పోలీస్ అధికారి భార్య అనుమానాస్పద మరణం
షీనాబోరా హత్యకేసులో విచారణ అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ మంగళవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది.
ముంబై: షీనాబోరా హత్యకేసులో విచారణ అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ మంగళవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసును ధ్యానేశ్వర్ గనోర్ విచారిస్తున్నారు. ముంబాయిలోని శాంతాక్రూజ్ ఏరియాలోని ఇంటిలో ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ అనుమానాస్పదస్థితిలో మరణించి ఉంది.

ఇంటికి వచ్చిన ధ్యానేశ్వర్ తన భార్య మరణించి ఉండడాన్ని ఆయన పోలీసులకు సమాచారమిచ్చాడు. ఉదయం పదిన్నరగంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా భార్య ఎంతకు తలుపులు తీయలేదు. ఫోన్ చేసినా ఫలితం లేకుండాపోయిందని పోలీసులు తెలిపారు.
ఏదోరకంగా తలుపులు తెరిచిచూస్తే రక్తపు మడుగులో ఉన్న తన భార్య మృతదేహం కన్పించిందని ధ్యానేశ్వర్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ సంఘటన జరిగిన నాటి నుండి కూడ తన కొడుకు కూడ కన్పించకుండాపోయాడని ఆయన చెబుతున్నారు.
అంతేకాదు తన కొడుకు సెల్ ఫోన్ కూడ స్విఛ్చాప్ లో ఉందన్నారు.సంఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications