నిర్భయ దోషులకు ఉరి..? త్వరలోనే అమలు, 28వ తేదీనే సమాచారం..
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తామని తీహార్ జైలు అధికారులు ప్రకటించారు. నిర్భయపై లైంగికదాడి చేసిన కీచకులు ముఖేశ్, వినయ్, అక్షయ్, పవన్కు త్వరలో ఉరిశిక్ష అమలు చేస్తామని పేర్కొన్నది. వారికి ఉరిశిక్ష అమలు చేసే విషయాన్ని ఈ నెల 28వ తేదీన తెలియజేశామని తెలిపింది.
నిర్భయ కేసు దేశంలో కలకలం రేపింది. నిర్భయపై కీచకులు దారుణంగా ప్రవర్తించారు. సున్నితమైన ప్రాంతంలో దాడి చేయడంతో.. ఆమె చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దిగువ కోర్టు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే శిక్ష అమలులో జాప్యం జరుగుతుంది. సాధారణంగా ఉరిశిక్ష విధిస్తే.. కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. అక్కడ కూడా సానుకూలంగా రాకుంటే గవర్నర్, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరతారు. వారు కూడా కరుణించకుంటే ఉరిశిక్షను అమలు చేస్తారు.

నిర్భయ కేసులో దోషులు ఉరిశిక్షను సవాల్ చేసే అవకాశం ఉంది. కానీ వారెవరే దరఖాస్తు చేయలేదు. గవర్నర్, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరలేదు. ఉరి శిక్షకు సంబంధించి సమాచారం వారికి అందజేశామని తెలిపారు. గడువు తేదీలోగా నిందితులు క్షమాభిక్ష కోరాలని లేదంటే న్యాయస్థానానికి సమాచారం అందజేస్తామని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఉరిశిక్ష అమలు చేస్తామని తీహర్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ తెలిపారు. నిర్భయ దోషుల్లో ముగ్గురు తీహార్ జైలులో ఉండగా మరొకరు మండొలి జైలులో ఉన్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications