సాంబార్ రుచిగా లేదని భర్త, అత్త తిట్టారు: బెంగళూరులో మహిళ ఆత్మహత్య !
సాంబార్ సరిగా చెయ్యలేదని, తినడానికి రుచిగా లేదని అత్త, భర్త తిట్టారని జీవితంపై విరక్తి చెందిన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని కూనప్పన అగ్రహార (కేపీ అగ్రహార) పోలీస్ స్టేషన్.
బెంగళూరు: సాంబార్ సరిగా చెయ్యలేదని, తినడానికి రుచిగా లేదని అత్త, భర్త తిట్టారని జీవితంపై విరక్తి చెందిన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని కూనప్పన అగ్రహార (కేపీ అగ్రహార) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కేపీ అగ్రహారలోని చోళూరుపాళ్య ప్రాంతంలో శ్రీనివాస్, నాగరత్న దంపతులు నివాసం ఉంటున్నారు. 28 ఏళ్ల కిత్రం శ్రీనివాస్, నాగరత్నకు వివాహం జరిగింది. శ్రీనివాస్, నాగరత్న దంపతులకు మిథున్ అనే కుమారుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి ఇంటిలో అందరూ భోజనం చెయ్యడానికి కుర్చున్నారు.

నాగరత్న భర్త శ్రీనివాస్ తో పాటు అత్త, కుమారుడు మిథున్ భోజనం వడ్డించారు. ఆ ససందర్బంలో సాంబార్ రుచిగా లేదని, ఇలాగేనా వంటలు చేసేది అంటూ నాగరత్న మీద ఆమె భర్త శ్రీనివాస్, అత్త మండిపడ్డారు. ఒక్క రోజు సాంబార్ రుచిగా లేదని అందరి ముందు తిట్టారని జీవితంపై విరక్తి చెందిన నాగరత్న తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. నాగరత్న కుమారుడు మిథున్ వెళ్లి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications