చలి పంజాకు 12 మంది బలి..!
వాషింగ్టన్ : అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అతి తక్కువ టెంపరేచర్లు నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు.. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. వీపరీతమైన చలి తట్టుకోలేక 12 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా డెట్రాయిట్ తో పాటు చాలా ప్రాంతాల్లో కాలువలు, జలపాతాలు గడ్డ కట్టుకుపోయాయి.

చలి బాధ తాళలేక విలవిల్లాడిపోతున్నారు అక్కడి ప్రజలు. మరో 24 గంటలు వాతావరణ పరిస్థితి అలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. మైనస్ 30 నుంచి మైనస్ 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కంటిన్యూ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. కెనడాలో కూడా మైనస్ 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. నిరాశ్రయుల కోసం చాలాచోట్ల వందల సంఖ్యలో వార్మింగ్ కేంద్రాలు (చలి నుంచి కాపాడుకోవడానికి వెచ్చదనం లభించేలా ఏర్పాట్లు) తెరిచారు. జనజీవనం స్థంభించడమే గాకుండా రైళ్లు, విమానాల రాకపోకలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పాఠశాలలు మూతపడ్డాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications