భూమిని ఢీకొననున్న ఉల్క: సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్త హెచ్చరిక
భూమికి మరో ప్రమాదం పొంచివుందా? అంటే అవుననే అంటున్నారు ఐర్లాండ్ శాస్త్రవేత్తలు.
లండన్: భూమికి మరో ప్రమాదం పొంచివుందా? అంటే అవుననే అంటున్నారు ఐర్లాండ్ శాస్త్రవేత్తలు. భూమిని ఓ భారీ ఉల్క ఢీకొనడం ఖాయమని, ఇందుకోసం ప్రపంచం మొత్తం సిద్ధం కావాలని ఐర్లాండ్కు చెందిన ప్రఖ్యాత ఆస్ట్రోఫిజిసిస్ట్ ఫిట్జ్ సిమ్మన్స్ హెచ్చరించాడు.
1908లో ఒక చిన్న ఉల్క సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతాన్ని ఢీకొనడంతో 800 చదరపు మైళ్ల భూభాగం సర్వనాశనమైందని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆ స్థాయి ఉల్క ఢీకొంటే ఒక పెద్ద నగరమే భస్మీ పటలం అవుతుందని తెలిపారు.

అదే పెద్ద ఉల్క ఢీకొంటే జరిగే నష్టం మాత్రం అపారంగానే ఉండనుందని తెలిపారు. మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఎంతో కృషి చేసి, భూమికి సమీపంలో ఉన్న, మనకు హాని కలిగించే 1800 ఆస్టరాయిడ్స్ను గుర్తించారని చెప్పారు.
అయితే, ఇంకా చాలా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రతిరోజూ మన శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉండే ఉల్కలను గుర్తిస్తూనే ఉంటారని ఫిట్జ్ తెలిపారు. అయితే, వాటి వల్ల హాన ఉండదన్నారు. కాగా, మరో తుంగుస్కా ఘటన ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉందంటూ ఆయన ప్రపంచ ప్రజల్ని హెచ్చరించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications