భూమిని ఢీకొననున్న ఉల్క: సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్త హెచ్చరిక
భూమికి మరో ప్రమాదం పొంచివుందా? అంటే అవుననే అంటున్నారు ఐర్లాండ్ శాస్త్రవేత్తలు.
లండన్: భూమికి మరో ప్రమాదం పొంచివుందా? అంటే అవుననే అంటున్నారు ఐర్లాండ్ శాస్త్రవేత్తలు. భూమిని ఓ భారీ ఉల్క ఢీకొనడం ఖాయమని, ఇందుకోసం ప్రపంచం మొత్తం సిద్ధం కావాలని ఐర్లాండ్కు చెందిన ప్రఖ్యాత ఆస్ట్రోఫిజిసిస్ట్ ఫిట్జ్ సిమ్మన్స్ హెచ్చరించాడు.
1908లో ఒక చిన్న ఉల్క సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతాన్ని ఢీకొనడంతో 800 చదరపు మైళ్ల భూభాగం సర్వనాశనమైందని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆ స్థాయి ఉల్క ఢీకొంటే ఒక పెద్ద నగరమే భస్మీ పటలం అవుతుందని తెలిపారు.

అదే పెద్ద ఉల్క ఢీకొంటే జరిగే నష్టం మాత్రం అపారంగానే ఉండనుందని తెలిపారు. మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఎంతో కృషి చేసి, భూమికి సమీపంలో ఉన్న, మనకు హాని కలిగించే 1800 ఆస్టరాయిడ్స్ను గుర్తించారని చెప్పారు.
అయితే, ఇంకా చాలా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రతిరోజూ మన శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉండే ఉల్కలను గుర్తిస్తూనే ఉంటారని ఫిట్జ్ తెలిపారు. అయితే, వాటి వల్ల హాన ఉండదన్నారు. కాగా, మరో తుంగుస్కా ఘటన ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉందంటూ ఆయన ప్రపంచ ప్రజల్ని హెచ్చరించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications