భూమికి అతి సమీపంలో ప్రయాణించనున్న ఆస్టరాయిడ్
హ్యూస్టన్: శుక్రవారం (09-02-2018) ఓ ఆస్టరాయిడ్ భూమికి అతి సమీపానికి రానుంది. 50 నుంచి 130 ఫీట్ల వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్ భూమికి 39వేల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది. ఈ దూరం భూమికి, చంద్రుడికి మధ్య దూరంలో అయిదో వంతు ఉంటుంది.
అంత తక్కువ ధూరంలో భూమి సమీపం నుంచి ప్రయాణిస్తుంది. నాసా ఆధ్వర్యంలో నడుస్తున్న సీఎస్ఎస్ (కాటాలినా స్కై సర్వే) ఫిబ్రవరి 4వ తేదీన రెండు ఆస్టరాయిడ్లను గుర్తించారు.

ఫిబ్రవరి 6వ తేదీన స్పెస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగించిన రోజు చిన్న ఆస్టరాయిడ్ ప్రయాణించింది. దీని పేరును 2018 సీసీగా నామకరణం చేశారు. శుక్రవారం పరిమాణంలో పెద్దగా ఉండే ఆస్టరాయిడ్ (పేరు ఆస్టరాయిడ్ 2018 సీబీ) భూమికి సమీపంలో ప్రయాణిస్తుంది.
ఈ ఆస్డరాయిడ్ ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ (ఈఎస్టీ) ప్రకారం ఫిబ్రవరి 9న సాయంత్రం గం.5.30 నిమిషాలకు ప్రయాణించనుంది. ఈ ఆస్టరాయిడ్ పరిమాణంలో పెద్దగా ఉండటమేకాదు. 2018 సీసీ ఆస్టరాయిడ్ కంటే భూమికి దగ్గరగా ప్రయాణిస్తుంది.
భూమికి అతి దగ్గరగా 39వేల మైళ్ల (64 వేల కిలోమీటర్ల) దూరం నుంచి అది వెళ్లనుంది. దీనివల్ల భూమికి వచ్చిన ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది 15 నుంచి 30 మీటర్ల పొడువున్నట్లు నాసా వెల్లడించింది. ఇక, మన భారత కాలమానం ప్రకారం శనివారం వేకువజామున నాలుగు గంటలకు భూమిని దాటి వెళ్లనుంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications