Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌పై ఆగని చైనా కుట్రలు: సముద్రంలోకి భారీ నిఘా నౌక, క్షిపణి ప్రయోగం వాయిదా

న్యూఢిల్లీ/బీజింగ్: భారత్‌పై చైనా తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. భారత్ చేపడుతున్న రక్షణకు సంబంధించిన ప్రయోగాలపై చైనా కుయుక్తులు పన్నుతోంది. అయితే, చైనా కుట్రలపై భారత్ కూడా డేగ కన్ను వేసి ఉంచింది. ఈ క్రమంలోనే హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిన చైనా నిఘా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది.

చైనా నిఘా నౌక కారణంగా భారత కీలక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం వాయిదా వేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. కాగా, నవంబర్ 10-11న ఓ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత్ ఇటీవల నోటీమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నట్టేందుకు సిద్ధమైంది.

2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి పయనం.. శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. ఈ క్రమంలో, భారత్ నోటీసు జారీ చేసిన కొద్ది రోజులకే చైనాకు చెందిన యువాన్ వాంగ్-6 అనే భారీ నౌక హిందూ మహా సముద్రంలో ప్రవేశించింది. శుక్రవారం ఉదయం ఈ నౌక ఇండోనేషియాలోని బాలి తీరం నుంచి బయల్దేరింది. ఇది పరిశోధనా నౌక అని డ్రాగన్ చెబుతున్నప్పటికీ.. అయితే, దీనికి క్షిపణి పరీక్షలు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఉన్నట్లు సమాచారం.

Days before India’s ballistic missile test, Chinese spy ship enters Indian Ocean

భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను చైనా హిందూ మహా సముద్రంలోకి పంపించడంతో.. మన క్షిపణి ప్రయోగం, ఆయుధ సామర్థ్యంపై కన్నేసి ఉంచేందుకే ఈ చర్య చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

అంతేగాక, చైనా నౌక కదలికలను సునిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు భారత నావికా దళ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం ఓ మిషన్ కూడా కొనసాగుతోందని వెల్లడించాయి. ఇది ఇలావుండగా, ఈ ఏడాది ఆగస్టులోనే చైనాకు చెందిన ఓ నిఘా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టోట రేపులో లంగరేయడం వివాదాస్పదంగా మారింది. భారత్ దీనిపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. పట్టించుకోని శ్రీలంక సర్కారు.. చైనా నౌకకు అనుమతిచ్చింది. భారీ మొత్తంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించుకోకపోవడంతో ఈ రేవును శ్రీలంక.. చైనాకు 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో చైనా.. శ్రీలంక తీరాన్ని ఉపయోగించుకుంటుండటం భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+