కేఫ్లో జొరబడి 18 విదేశీయులను చంపిన ఘటన నిందితుడి హతం
ఢాకా కేఫ్ పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న నురుల్ ఇస్లాం అలియాస్ మర్జాన్ అలియాస్ షకీల్ శుక్రవారం ఉదయం హతమయ్యాడు. నాటి పేలుళ్లకు ఇతను మాస్టర్ మైండ్గా భావిస్తున్నారు.
ఢాకా: గత ఏడాది జూలై నెలలో ఢాకా కేఫ్ పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న నురుల్ ఇస్లాం అలియాస్ మర్జాన్ అలియాస్ షకీల్ శుక్రవారం ఉదయం హతమయ్యాడు. నాటి పేలుళ్లకు ఇతను మాస్టర్ మైండ్గా భావిస్తున్నారు. ఇతని వయస్సు 22 ఏళ్లు.
ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు జరిపిన దాడుల్లో మర్జాన్, మరో అనుమానిత తీవ్రవాది హతమైనట్లు పోలీసులు చెప్పారు. తీవ్రవాదుల కదలికలపై తమకు అందిన సమాచారం మేరకు ఢాకాలోని రేయర్ బజార్ పరిసరాల్లో దాడులు జరిపారు.

అనంతరం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. వారు కాల్పుల్లో మరణించారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్నది స్పష్టం చేయాల్సి ఉంది. మర్జాన్ ఢాకా దాడి కుట్రదారుల్లో ఒకడని పోలీసులు తెలిపారు.
2016 జులై 1న కొందరు ఉగ్రవాదులు ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరీలో చొరబడి పద్దెనిమిది మంది విదీశీయులను బందీలుగా తీసుకుని చంపేశారు.

ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించింది. దాడికి సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది. కానీ బంగ్లా పోలీసులు ఖండించారు. బంగ్లాదేశ్కే చెందిన జమాతె ముజాహిదీన్ (జేఎం) బంగ్లాదేశ్ అనే ఉగ్ర సంస్థ ఈ దాడి చేసిందన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications