లిబియాలో ఘోర ప్రమాదం: రెండు పడవలు బోల్తా, 170 మంది గల్లంతు
లిబియా: మధ్యధరా సముద్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగాయి. దీంతో 170 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. లిబియా తీరంలో శనివారం ఓ పడవ మునిగి పోయినట్లు ఇటలీ నావికాదళం వెల్లడించింది.
ఇందులో దాదాపు 117 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో పది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఒక శిశువు ఉన్నారు. ఈ పడవ లిబియాలోని గారాబుల్లి రేవు నుంచి ప్రయాణం ప్రారంభించిన పది గంటల్లో మునిగిపోయినట్లు తెలిపారు.

మరో పడవ మొరాకో నుంచి బయలుదేరి మధ్యధరా సముద్రానికి పశ్చిమాన అలబోరన్ సముద్రంలో మునిగింది. ఈ పడవలో యాభై మందికి పైగా ఉన్నారు. ఈ పడవ నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం ఇటలీ నావికాదళం గాలింపు చర్యలు చేపట్టింది.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications