లిబియాలో ఘోర ప్రమాదం: రెండు పడవలు బోల్తా, 170 మంది గల్లంతు
లిబియా: మధ్యధరా సముద్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగాయి. దీంతో 170 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. లిబియా తీరంలో శనివారం ఓ పడవ మునిగి పోయినట్లు ఇటలీ నావికాదళం వెల్లడించింది.
ఇందులో దాదాపు 117 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో పది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఒక శిశువు ఉన్నారు. ఈ పడవ లిబియాలోని గారాబుల్లి రేవు నుంచి ప్రయాణం ప్రారంభించిన పది గంటల్లో మునిగిపోయినట్లు తెలిపారు.

మరో పడవ మొరాకో నుంచి బయలుదేరి మధ్యధరా సముద్రానికి పశ్చిమాన అలబోరన్ సముద్రంలో మునిగింది. ఈ పడవలో యాభై మందికి పైగా ఉన్నారు. ఈ పడవ నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం ఇటలీ నావికాదళం గాలింపు చర్యలు చేపట్టింది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications