వట్టిదే, భూమికి ఆస్టరాయిడ్ ప్రమాదం లేదు: నాసా
వాషింగ్టన్: వచ్చే నెలలో (సెప్టెంబర్) భూమిని ఆస్టరాయిడ్లు (గ్రహశకలం) ఢీకొంటుందనే ప్రచారం జరుగుతోంది. దీని పైన నాసా స్పందించింది. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్లు భూమిని తాకే అవకాశాలు రానున్న వంద ఏళ్లలో 0.01 శాతం మాత్రమే ఉందని చెప్పారు.
సెప్టెంబర్ నెల 15, 28 తేదీల మధ్య కాలంలో భారీ గ్రహశకలం ఒకటి భూమిని తాకి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించవచ్చంటూ వచ్చిన వార్తలను నాసా కొట్టి పారేసింది. ఆ నెలలో ఖగోళానికి చెందిన వస్తువేదీ మన భూమిని ఢీకొడుతుందని చెప్పడానికి ఒక్క ఆధారమూ లేదని చెప్పింది.
సెప్టెంబర్ 15 నుంచి 28 మధ్య కాలంలో భారీ గ్రహశకలం ఒకటి భూమిని ఢీకొట్టవచ్చంటూ ఇటీవలి కాలంలో లెక్కలేనన్ని బ్లాగ్లు, వెబ్లలో తప్పుడు కథనాలు వచ్చాయని నాసా పేర్కొంది.

ఆ తేదీల్లో ఒక రోజున పోర్టారికో సమీపంలో గ్రహ శకలం భూమిని ఢీకొంటుందని, దాని ఫలితంగా అమెరికా, మెక్సికోలలోని అట్లాంటిక్ గల్ఫ్ తీరాలకు, అలాగే మధ్య, దక్షిణ అమెరికాలకు భారీ నష్టం సంభవించవచ్చని ఆ కథనాలు పేర్కొన్నాయి.
అయితే ఆ తేదీల్లో గ్రహ శకలం కానీ లేదా ఏదైనా ఖగోళ వస్తువు కానీ భూమిని తాకుతుందనేందుకు ఆధారాలు లేవని చెప్పింది. అంతేకాదు భూమికి దగ్గరగా ఉన్న వస్తువులను గుర్తించే కార్యక్రమం ప్రకారం సమీప భవిష్యత్తులో భూమిని తాకే గ్రహ శకలం కానీ, తోకచుక్క కానీ ఏదీ లేదు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications