చైనాలో విద్యుత్ ప్లాంట్ పేలిపోయింది
బీజింగ్: చైనాలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అత్యంత ఒత్తిడితో కూడిన ఆవిరి గొట్టం పేలడంతో 21 మంది కార్మికులు దుర్మరణం చెందారు. అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు.
చైనాలోని హ్యూబే ప్రావిన్స్ డ్యాంగ్ యాంగ్ నగరంలో మాడియన్ గాంగ్యు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పైప్ ను పరిశీలిస్తున్న సమయంలో ఒక్క సారిగా పేలిపోయింది.

విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. సహాయక చర్యలు చేపట్టి పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. గాయాలైన వారిని డ్యాంగ్ యాంగ్ నగరంలోని ఆసుపత్రులకు తరలించారు.
గత సంవత్సరం ఆగస్టు 12వ తేదిన చైనా ఈశాన్య నగరంలోని తియాన్ జిన్ లో పేలుడు కారణంగా 173 మంది దుర్మరణం చెందారు. కార్మికుల భద్రత గురించి నిర్లక్షం చెయ్యడం వలనే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications