ఇండోనేషియాలో భారీ వర్షాలు..24 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జకార్తాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగి పడటంతో 24 మంది మృతి చెందగా చాలామంది గల్లంతయ్యారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక శిబిరాల్లో ఉంచింది ప్రభుత్వం. భారీ వర్షాలకు ఇళ్ల నీట మునిగాయి. పలు ఇళ్లులు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలకు కార్లు ఇతర వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. కొంత మంది ప్రజలు రబ్బర్ బోట్ల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు.

జకార్తా నగరాన్ని ముంచెత్తిన వానలు
గ్రేటర్ జకార్తా ప్రాంతంలో 21 మంది మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. లెబాక్ ప్రాంతంలో మరో ఇద్దరు మృతి చెందారని ఇండోనేషియా మంత్రి జులియారీ పీటర్ బతుబరా తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని మంత్రి తెలిపారు. లెబాక్ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు జాడ కనిపించడం లేదని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. వారి జాడ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే లెబాక్ ప్రాంతంలో మొత్తంగా 8 మంది ఆచూకీ గల్లంతైందని పోలీసులు చెప్పారు. ఇక కొండచరియలు విరిగి పడటంతో 8 ఏళ్ల బాలుడు, 82 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు.

అంధకారంలో జకార్తా నగరం
వరదల ధాటికి కొందరు నీట మునగగా అందులో ఒకరు కరెంట్ షాక్తో మృతి చెందినట్లు సమాచారం. భారీ వర్షాలతో జకార్తా మునిగిపోయిందని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ముందస్తు హెచ్చరికలు చేయలేదని చెప్పారు. భారీ వర్షాలకు నీరు క్రమంగా నివాస ప్రాంతాల్లోకి చేరి ఆపై వేగం పుంజుకుందని చెప్పారు. వరద క్రమంగా పెరగడంతో తామంతా నీటిలోనే చిక్కుకుపోయినట్లు బాధితులు తెలిపారు. ఇదిలా ఉంటే చాలా ప్రాంతాలు విద్యుత్ సరఫరా లేక అంధకారంలో ఉండిపోయాయి. విద్యుత్ సరఫరా ఉంటే షాక్తో ప్రజలు మృతి చెందుతున్నారని అందుకే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.

విమానాశ్రయం రన్వేపైకి చేరిన వరద నీరు
జకార్తాలో రైల్వే స్టేషన్లను, విమానాశ్రయాలను మూసివేసినట్లు తెలిపారు అధికారులు. హలీమ్ పర్దానకుసుమ విమానాశ్రయం రన్వేపైకి నీరు వచ్చి చేరడంతో విమానసర్వీసులను రద్దు చేసింది ప్రభుత్వం. కొన్ని విమానాల దారి మళ్లించింది. 2013 తర్వాత ఇంతటి భారీ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారని ఇండోనేషియా ప్రభుత్వం పేర్కొంది. ఇండోనేషియాలో నవంబర్లో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే 31వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications