అస్ట్రేలియాలో క్రైస్తవ మతబోధకుడిపై దాడి
అమెరికాలో భారతీయులపై కొనసాగుతున్న దాడులు అస్ట్రేలియాకు వ్యాపించాయి. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాడులు పెరిగాయనే ఆందోళన భారతీయుల్లో కొనసాగుతోంది.ఈ తరుణంలోనే అస్ట్రేలియాలో క
మెల్ బోర్న్: అమెరికాలో భారతీయులపై కొనసాగుతున్న దాడులు అస్ట్రేలియాకు వ్యాపించాయి. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాడులు పెరిగాయనే ఆందోళన భారతీయుల్లో కొనసాగుతోంది.ఈ తరుణంలోనే అస్ట్రేలియాలో కూడ ఇండియాకు చెందిన వారిపై దాడులు జరగడం ఆందోళన కల్గిస్తోంది.
మెల్ బోర్న్ లోని ఓ చర్చిలో భారత సంతతికి చెందిన క్రైస్తవ మత గురువుపై దాడి చేసి గొంతులో పొడిచాడు. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన టామీ కలథూర్ మాథ్యూ మెల్ బోర్న్ శివారు ఫాకనర్ ప్రాంతంలో సెయింట్ మాత్యూన్ చర్చిలో ఆదివారం నాడు ప్రార్థనలు చేయిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది.

చర్చిలో ప్రార్థన చేయడానికి వచ్చిన వారి ముందే దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడు.నువ్వు భారతీయుడివి. హిందువు లేదా ముస్లింవి. నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు. నిన్ను చంపేస్తా అంటూ అరుస్తూ దుండగులు కత్తితో మాత్యూ దగ్గరికి వచ్చి పొడిచాడు.
కొంతమంది అతడిని పట్టుకొనే ప్రయత్నం చేసినప్పటికి ఆయన తప్పించుకొన్నాడు. మాథ్యూ ఆసుపత్రిలో చికిత్సతీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రార్థన సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించినందున మెడ చుట్టూ మందంగా ఉండే వస్త్రం ఉండడంతో కత్తి లోపలికి దిగలేదని వైద్యులు చెప్పారు. పోలీసులు 72 ఏళ్ళ దుండగుడిని ఆదివాం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడు ఇటాలియన్ సంతతికి చెందినవాడుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications