స్మార్ట్ఫోన్ చూసుకుంటూ యువతి: ఢీకొట్టిన రైలు
టోక్యో: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేకపోతోంది నేటి యువత. రోజులో దాదాపు ఎక్కువ సమయాన్ని స్మార్ట్ ఫోన్లకే కేటాయిస్తుండటం గమనార్హం. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రమాదకర రీతిలో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమైన విషయం. రోడ్లపై వెళుతున్నప్పుడు కూడా వాహనాలను గమనించకుండా స్మార్ట్ఫోన్లలోనే మునిగిపోతుండటంతో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా, ఇలాంటి ఘటనే జపాన్లో చోటు చేసుకుంది. తన స్మార్ట్ఫోన్ చూస్తూ.. పరిసరాలను గమనించకుండా ముందడుగేసిన ఓ యువతి.. తన ప్రాణాలకే ముప్పుతెచ్చుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినా.. ఈ ఘటన ఆలోచింపజేసేలా ఉంది.

ఫుజిసవాలో కుగెనుమకైగన్ రైల్వే స్టేషన్లో 17ఏళ్ల అమ్మాయి స్మార్ట్ ఫోన్ చూస్తూ ఫ్లాట్ ఫాంపై నడుచుకుంటూ వెళుతోంది. అటుగా రైలు వస్తున్నా.. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్లాట్ ఫాం చివరగా ట్రాక్ దగ్గరగా వెళ్లింది.
ఇంతలో వచ్చిన రైలు.. ఆమె తలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. రైలు నెమ్మదిగా రావడం, ఆమె ట్రాక్పై పడకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఆ అమ్మాయి చిన్నపాటి గాయాలతో బయటపడింది. స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తూ రోడ్లపై, రైల్వే స్టేషన్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రమాదకరమంటున్నారు పెద్దలు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications