భారత్తో స్నేహానికి సిద్ధం కానీ: గట్టిగా జవాబు చెప్తామని పాకిస్తాన్ హెచ్చరిక
భారత దేశంతో స్నేహ సంబంధానికి పాకిస్తాన్ ఎప్పుడూ సిద్ధమేనని, చర్చల ద్వారా పరిష్కారాన్ని తామూ కోరుకుంటున్నామని పాక్ కొత్త విదేశాంగ మంత్రి ఆసిఫ్ అన్నారు.
ఇస్లామాబాద్: భారత దేశంతో స్నేహ సంబంధానికి పాకిస్తాన్ ఎప్పుడూ సిద్ధమేనని, చర్చల ద్వారా పరిష్కారాన్ని తాము కోరుకుంటున్నామని పాక్ కొత్త విదేశాంగ మంత్రి ఆసిఫ్ అన్నారు.
కాశ్మీర్ అంశం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ విషయంలో తాము రాజీపడమని తేల్చి చెప్పారు. మేం స్నేహానికి సిద్ధంగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం తమతో సన్నిహిత సంబంధాలకు ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు.

భారత్తో సత్సంబంధాల కోసం మా ప్రయత్నం
కొన్ని దేశాలతో కలిసి సింధునదీ జలాల పంపకంపై అనవసర వివాదం తీసుకొస్తొందని భారత్పై విమర్శలు చేశారు. సరిహద్దు దేశాలతో శాంతికాముకంగా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. అటు ఆఫ్గానిస్థాన్, ఇటు భారత్తో సత్సంబంధాల కోసం పాక్ యత్నిస్తోందన్నారు.
Recommended Video


గట్టిగా జవాబు చెప్తామని హెచ్చరిక
అయితే భారత్ మాత్రం ఆఫ్గానిస్తాన్తో కలిసి పాకిస్తాన్ను దూరంగా ఉంచడాన్ని ఆసిఫ్ ప్రశ్నించారు. దౌత్య సంబంధాల మెరుగుదలకు పాకిస్తాన్ కృషి చేస్తున్నా తమది మెతక దేశమని ఇతరులు భావిస్తే గట్టిగా జవాబు చెబుతామని హెచ్చరించారు.

ఆ శక్తుల చర్యలు ఫలించవు
పాకిస్తాన్ పైన ఎలాంటి దాడులు జరిగినా తిప్పికొట్టే పటిష్టస్థితిలో ఉందన్నారు. పాక్ను విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు చేస్తున్న చర్యలు ఎప్పటికీ ఫలించబోవన్నారు.

వ్యాఖ్యలపై విమర్శలు
కాగా, ఆసిఫ్ వ్యాఖ్యలను పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు తప్పుబట్టారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అందుకు సంబంధించిన మూలాలు పాక్లోనే ఉండటాన్ని ప్రస్తావించారు. భారత్లోకి లష్కర్, జైస్ ఎ మహ్మద్.. తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన మూకలను పంపిస్తూ భారత్లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాక్ వైఖరిని తప్పుబట్టారు.
-
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications