పాకిస్తాన్ ను ఉతికి ఆరేసిన భారత్..!!
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రసంగించారు. పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశం పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే ఏకిపారేశారు. తీవ్రవాదానికి పాకిస్తాన్ ఎపిక్ సెంటర్ గా అభివర్ణించారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ప్రపంచ దేశాల బాధ్యతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని దేశాలు సమష్టిగా దీన్ని అణచివేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారత్.. తీవ్రవాద ముప్పును ఎదుర్కొంటుందని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా.. అవి ఒక్క దేశంతో సంబంధం ఉన్నవే.. దానికి సంబంధించినవేనని పాకిస్తాన్ ను ఉద్దేశించి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటన- సరిహద్దుల మీదుగా జరిగే అనాగరికతకు నిదర్శనమని జైశంకర్ స్పష్టం చేశారు.

పహల్గామ్ దాడికి కారణమైనవారిని శిక్షించామని జైశంకర్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ ద్వారా దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకునే హక్కును భారత్ స్వేచ్ఛగా వినియోగించుకుందని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద దాడిని ప్లాన్ చేసిన వారిని, అమలు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టామని అన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మతం, హింస, అసహనం, భయం.. ఇలా అన్నింటినీ కలగలిపిన ఉగ్రవాదాన్ని నిర్మూలించక తప్పదని జైశంకర్ తేల్చి చెప్పారు. ఉగ్రవాదులను అభివృద్ధి నిరోధకులుగా అబివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారత్.. ఈ సవాల్ ను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. తీవ్రవాదానికి ఎపిక్ సెంటర్ అయిన పొరుగుదేశం భారత్ కు ఉందని వివరించారు. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సరిహద్దు ఉగ్రవాదం, చొరబాటు, తీవ్రవాద శిబిరాలు.. ఇలా అన్నింటినీ భారత్ పై గురిపెట్టిందని పేర్కొన్నారు.
వివిధ దేశాలకు భారత్ అందిస్తోన్న సహకారాన్ని జైశంకర్ వివరించారు. 78 దేశాల్లో 600 కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు బాధ్యత వహిస్తున్నామని, గ్లోబల్ సౌత్లో అగ్రగామిగా నిలిచామని చెప్పారు. ఆర్థికం, ఆహారం, ఎరువులు, ఇంధనం వంటి రంగాల్లో 78 దేశాలకు సహాయ, సహకారాలను అందిస్తోన్నామని తెలిపారు. ఇతర దేశాల అత్యవసర అవసరాలకు ప్రతిస్పందించడానికి ఎప్పుడూ ముందుంటామని అన్నారు. భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు మానవత దృక్పథంతో ఆదుకుంటోన్నామని చెప్పారు.
-
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
పాకిస్థాన్ ఖేల్ ఖతం.. లీటర్ పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335.. -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications