వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుధగ్రహంపై కూలిపోనున్న నాసా వ్యోమనౌక మెసెంజర్

By Pratap
|
Google Oneindia TeluguNews

నాసా : వ్యోమనౌక మెసెంజర్‌ మరో రెండు వారాల్లో బుధగ్రహంపై కూలిపోతుందని అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు. 2004లో ప్రయోగించిన ఈ వ్యోమనౌకలో ఇంధనం పూర్తిగా నిండుకుందని అంటున్నారు. దీంతో ఈ నెల 30న సెకనుకు 3.91 కిలోమీటర్ల వేగంతో బుధగ్రహా ఉపరితలాన్ని తాకనుందని వివరించారు.

ఇది కూలిపోయే ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు సుమారుగా అంచనా వేశారు. దాన్ని చూసే అవకాశం లేదని తెలిపారు. ఈ నెల 24న చివరిసారిగా కనిపించనున్న మెసెంజర్‌ ఆ తర్వాత మరో వారం పాటూ ప్రయాణించి 30న బుధుడి ఉపరితలాన్ని తాకుతుందని చెప్పారు.
పరిశోధకులు కానీ, వ్యోమగాములు కానీ దీన్ని చూసే అవకాశం లేదని వారు వెల్లడించారు. దీన్ని 2--4లో ఫ్లా కేప్ కానావెరాల్ నుంచి ప్రయోగించారు. 2001లో అది బుధగ్రహం కక్ష్యలోకి చేరిన మొదటి వ్యోమనౌక.

Out of fuel, Messenger spacecraft will slam into Mercury

ఈ వ్యోమనౌక మెసెంజర్ సూర్యుడికి సమీపంలో ఉన్న బుధగ్రహం ధ్రువాల్లో నీటితో తయారైన మంచు ముద్దులు ఉన్నట్లు కనిపెట్టింది. జలంతో కూడిన మంచుకు కారణమైన వస్తువులే విచిత్రమైన సేంద్రియ వస్తువుల పొరలను కూడా కారణమైనట్లు కూడా దాని ద్వారా తెలిసిందని చెబుతున్నారు.

ఇప్పటికే మెసెంజర్‌లో ఇంధనం ముగిసింది. అయితే, దాని జీవిత కాలాన్ని పెంచడానికి ప్రొపలెంట్ ట్యాంక్స్‌పై ఒత్తిడి పెట్టడానికి ఉద్దేశించిన హీలియంను ప్రయోగించారు.

English summary
The NASA spacecraft that launched in 2004 from Cape Canaveral, Fla., and became the first to orbit Mercury in 2011 is on course to crash into the planet's surface April 30 at more than 8,700 mph.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X