బుల్లెట్ ట్రైన్కు జపాన్ ఆర్థిక సాయం .. షింజో తమ పాత స్నేహితుడన్న మోడీ
ఒసాకా : భారతదేశానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని జపాన్ తెలిపింది. జీ-20 సదస్సు జపాన్లోని ఒసాకాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీతో జపాన్ ప్రధాని షింజో అబే చర్చించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు సహకారం అందించాలని మోడీ కోరగా .. జపాన్ సుముఖత వ్యక్తం చేసింది.
బుల్లెట్ ట్రైన్కు బాసట ..
ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు జరుగుతుంది. దీనికి వారణాసి కన్వెక్షన్ చేస్తూ మార్పు చేశారు. ప్రాజెక్టుకు సహకారం అందించేందుకు పాత స్నేహితుడు షింజో అబే అంగీకరించామని మోడీ పేర్కొన్నారు. దీనికి సంబంధించి జపాన్ రూ.79 వేల కోట్ల రుణం భారత్కు ఇచ్చేందుకు అంగీకరించింది. జపాన్ సహకారంతో 2022లో బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కుతుందని మోడీ పేర్కొన్నారు. వారణాసి మరియు క్యోటో మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్కు జపాన్ భారత్కు సుమారు రూ .200 కోట్లు ఇచ్చింది. 2015లో మోడీ, అబే కలిసి వారణాసిని సందర్శించినప్పుడు ఈ ఒప్పందం జరిగింది.

నేరస్తులపై ఉక్కుపాదం ...
బుల్లెట్ రైలు కోసం ఆర్థిక సహకారంతోపాటు .. ఆర్థిక నేరస్తులను అప్పగించేందుకు కూడా సహకారం అందిస్తామని జపాన్ భరోసా కల్పించింది. ఇవాళ కీలక అంశాలపై షింజో అబేతో మోడీ చర్చించారు. రేపు ట్రంప్, మోడీలతో కూడా వివిధ అంశాలపై డిస్కస్ చేస్తారు అబే. ముఖ్యంగా ఇండో ఫసిఫిక్ రీజియన్లో అనుసరించాల్సిన వ్యుహంపై మూడుదేశాల అధినేతల మధ్య ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాదు రెండోసారి మోడీ విజయం సాధించాక .. తొలిసారి ఫోన్ చేసి అభినందించింది షింబో అబేనే. ఈ విషయాన్ని మోడీ ప్రత్యేకంగా గుర్తుచేశారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications