పాకిస్థాన్ కు మేమున్నాం.. భారత్ కు ఆ రెండు దేశాలు బిగ్ షాక్
పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ను ప్రపంచ దేశాలు స్వాగతించాయి. రష్యా, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలని ఇప్పటికే తీర్మానించాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కు మద్దతుగా రెండు దేశాలు నిలిచాయి. అవే టర్కీ, అజర్ బైజాన్. ఈ రెండు దేశాలు పాకిస్థాన్ ను సపోర్ట్ చేశాయి. ఆపరేషన్ సిందూర్ ను ఖండించాయి.
ఇరు దేశాలు దౌత్య పరమైన చర్చల ద్వారానే ముందుకు సాగాలని హితవు పలికాయి. ఈ మేరకు టర్కీ, అజర్ బైజాన్ దేశాలు వేరు వేరు ప్రకటనల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ట్వీట్ చేసింది. భారత్- పాకిస్థాన్ మధ్య ఉన్న సంబంధాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం.
భారత్.. పాకిస్థాన్ పై దాడి చేయడం యుద్ధానికి సంకేతం. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను మేము ఖండిస్తున్నాం. అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాయి. అలాగే ఇరుపక్షాలు సంయమనం పాటించాలని టర్కీ పేర్కొంది. ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలంది.

మరోవైపు భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు అజర్ బైజాన్ విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్థాన్పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు పౌరులు కూడా మృతి చెందారని.. పాకిస్థాన్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబసభ్యులు హతం అయ్యారు. ఆయన కుటుంబంలోని 10 మంది, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజహర్ వెల్లడించాడు. 56 ఏళ్ల మసూద్ అజహర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది.
ఇక పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్ పేర్కొన్నారు. మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని థిల్లాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే వాళ్ల దాడి భారత పౌరులకు ప్రమాదకరం కాకపోవచ్చని.. పాకిస్థాన్ మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications