బ్రిటన్లో త్రీ పేరెంట్ బేబీలు: బిల్లుకు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదం
లండన్: బ్రిటన్ పార్లమెంట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చేందుకు అనుమతించే బిల్లును హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదించింది. అంతక ముందు ఈ బిల్లు హౌజ్ ఆఫ్ కామన్స్లో కూడా నెగ్గంది. శిశివుకు జన్మనిచ్చే తల్లి అనారోగ్య మైటోకాండ్రియాని కలిగి ఉన్నట్లయితే ప్రాణాంతక వ్యాధులతో కూడిన బేబీలు పుడతారు.
కాబట్టి ఆరోగ్యకరమైన మైటోకాండ్రియా కల్గి ఉన్న వేరొక మహిళ నుండి దాన్ని జన్మనిచ్చే తల్లి పొంది ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మని ప్రసాదించవచ్చనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం. ఈ బిల్లుకి బ్రిటన్ పార్లమెంట్ అనుమతి తెలపడంతో త్రీ పేరెంట్ బేబి 2016లోగా జన్మించే అవకాశం ఉంది.

ఇక మైటోకాండ్రియా విషయానికి వస్తే ప్రతి కణంలో ఉంటూ ఆహార పదార్థాలను శక్తిగా మారుస్తుంది. ఒకవేళ మైటోకాండ్రియాలో జన్యు లోపాలు ఉన్నట్లయితే గుండె, మెదడు నిర్వహించే కార్యకలాపాలలకు కావల్సినంత శక్తిని అవి అందిచ లేవు. దీనిని అధిగమించడానికి న్యూకాస్టిల్లో ఓ టెక్నాలజీ కనిపెట్టారు.
ఇందులో ఆరోగ్యవంత మహిళ మైటోకాండ్రియాను తల్లిదండ్రుల డీఎన్ఏతో జతపరుస్తారు. శిశువుల డీఎన్ఏలో 0.1 శాతం మాత్రమే రెండో మహిళ నుంచి పుట్టబోయే బేబీకి అందుతుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్ తరాలు ఈ డీఎన్ఏతో ఆరోగ్యకరంగా, ఉత్సాహాంగా ఉంటారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications