భారత్కు చైనా మూడు ఆప్షన్స్: వెనక్కి తగ్గకపోతే చంపబడొచ్చంటూ హెచ్చరిక..
స్వచ్చందంగా భారత సైన్యం వెనక్కి తగ్గడం లేదా పట్టుబడటం జరగకపోతే సైనికులు చంపబడవచ్చంటూ హెచ్చరికలు జారీ చేశారు.
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య వివాదం ముదురుతూనే ఉంది. భూటాన్ సరిహద్దులోని డొక్లాం ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం ఆరోపణలు,ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. డోక్ లాం ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారిని అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని చైనా ముందు నుంచి ఆరోపిస్తోంది.
చైనా మీడియా సైతం భారత సైన్యానికి హెచ్చరికలు చేస్తూ కథనాలు ప్రచురిస్తూనే ఉంది. దౌత్యపరమైన సమాలోచనల ద్వారా ఈ ప్రతిష్టంభనకు పరిష్కారం దొరకదని, బేషరతుగా భారత్ తమ బలగాలను డొక్లామ్ నుంచి ఉపసంహరించుకోవాలని డ్రాగన్ హెచ్చరిస్తోంది.

తాజాగా ముంబైలో చైనా కౌన్సిల్ జనరల్ గా పనిచేసిన మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల నిపుణుడు లియు యౌఫా సెంట్రల్ టెలివిజన్ ఇంగ్లీష్ చానెల్తో మాట్లాడుతూ మూడు సూచనలు చేశాడు. సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు మరో దేశ భూభాగంలోకి ప్రవేశించారంటే.. వాళ్లు సహజంగానే శత్రువులుగా పరిగణించబడుతారు. అందుకు వారు మూడు పరిణామాలను ఎదుర్కోవాలని చెప్పారు.
1.స్వచ్చందంగా వెనక్కి తగ్గడం లేదా పట్టుబడటం
2.సరిహద్దు వివాదం ముదిరితే.. సైనికులు చంపబడవచ్చు.
3.చైనా వేచి చూసే ధోరణితో ఉందని, భారత్ అర్థవంతమైన సున్నిత ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటుందని భావిస్తున్నామని అన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications