భారత్కు చైనా మూడు ఆప్షన్స్: వెనక్కి తగ్గకపోతే చంపబడొచ్చంటూ హెచ్చరిక..
స్వచ్చందంగా భారత సైన్యం వెనక్కి తగ్గడం లేదా పట్టుబడటం జరగకపోతే సైనికులు చంపబడవచ్చంటూ హెచ్చరికలు జారీ చేశారు.
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య వివాదం ముదురుతూనే ఉంది. భూటాన్ సరిహద్దులోని డొక్లాం ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం ఆరోపణలు,ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. డోక్ లాం ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారిని అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని చైనా ముందు నుంచి ఆరోపిస్తోంది.
చైనా మీడియా సైతం భారత సైన్యానికి హెచ్చరికలు చేస్తూ కథనాలు ప్రచురిస్తూనే ఉంది. దౌత్యపరమైన సమాలోచనల ద్వారా ఈ ప్రతిష్టంభనకు పరిష్కారం దొరకదని, బేషరతుగా భారత్ తమ బలగాలను డొక్లామ్ నుంచి ఉపసంహరించుకోవాలని డ్రాగన్ హెచ్చరిస్తోంది.

తాజాగా ముంబైలో చైనా కౌన్సిల్ జనరల్ గా పనిచేసిన మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల నిపుణుడు లియు యౌఫా సెంట్రల్ టెలివిజన్ ఇంగ్లీష్ చానెల్తో మాట్లాడుతూ మూడు సూచనలు చేశాడు. సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు మరో దేశ భూభాగంలోకి ప్రవేశించారంటే.. వాళ్లు సహజంగానే శత్రువులుగా పరిగణించబడుతారు. అందుకు వారు మూడు పరిణామాలను ఎదుర్కోవాలని చెప్పారు.
1.స్వచ్చందంగా వెనక్కి తగ్గడం లేదా పట్టుబడటం
2.సరిహద్దు వివాదం ముదిరితే.. సైనికులు చంపబడవచ్చు.
3.చైనా వేచి చూసే ధోరణితో ఉందని, భారత్ అర్థవంతమైన సున్నిత ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటుందని భావిస్తున్నామని అన్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications