నా తల్లిని టచ్ కూడా చేయలేరు: షేక్ హసీనా తనయుడి సంచలనం!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు స్థానిక ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షేక్ హసీనా కుమారుడు, అవామీ లీగ్ సభ్యుడు సాజీబ్ వాజేద్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ (ICT) తన తల్లికి ఇచ్చిన మరణశిక్ష నిర్ణయాన్ని చట్టవిరుద్ధం, ఒక జోక్గా అభివర్ణించారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో యూనుస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ప్రభుత్వానికి ఎటువంటి ఎన్నికల మద్దతు లేదు, అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం. వారు ఈ ట్రిబ్యునల్ నుంచి 17 మంది న్యాయమూర్తులను తొలగించారు. ట్రయల్ బెంచ్లో ఎటువంటి అనుభవం లేని కొత్త న్యాయమూర్తిని నియమించారు. ఆ న్యాయమూర్తి బహిరంగంగా నా తల్లి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడారు. ఆయన స్పష్టంగా పక్షపాతంతో ఉన్నారు" అని వాజేద్ ఆరోపించారు.
యూనుస్ నా తల్లిని తాకలేరు..
మరణశిక్ష ప్రకటించిన తర్వాత మహ్మద్ యూనుస్ షేక్ హసీనాను చంపడానికి ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్నకు సాజీబ్ వాజేద్ బదులిస్తూ.. "లేదు, వారు ఆమెను చంపలేరు. వారు శిక్షను ఎలా అమలు చేయగలరు? మొదటిది, వారు ఆమెను పట్టుకోలేరు. రెండోది, చట్ట పాలన తిరిగి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. యూనుస్ నా తల్లిని తాకలేరు" అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు
సాజీబ్ వాజేద్ ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. "నేను ప్రధానమంత్రి మోదీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన నా తల్లి భద్రతను నిర్ధారించారు. ఆయన నా తల్లి ప్రాణాలను కాపాడారు. ఒక దేశాధినేతగా, ఆయన నా తల్లికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. దీనికి నేను భారత ప్రభుత్వానికి, భారతదేశ ప్రజలకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను," అని సాజీబ్ వాజేద్ పేర్కొన్నారు.
అప్పగింత సాధ్యం కాదు..
షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించడం గురించి అడిగినప్పుడు.. సాజీబ్ వాజేద్ ఇలా అన్నారు. "ఎవరినైనా అప్పగించడానికి, ఒప్పందంతో పాటు చట్టం ఉండాలి. మొదటిది, చట్టబద్ధమైన ప్రభుత్వం ఉండాలి, కానీ ఇక్కడ లేదు. రెండోది, సరైన ప్రక్రియ పాటించాలి, కానీ అది పాటించలేదు. ఆ ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలి, కానీ బంగ్లాదేశ్లో ఆ ప్రక్రియ పూర్తిగా చట్టవిరుద్ధం. కాబట్టి నా తల్లిని అప్పగించడం సాధ్యం కాదు." అని ఆయన అన్నారు.
ఎన్నికలతో మరణశిక్షకు సంబంధం
షేక్ హసీనాకు మరణశిక్ష విధించడం, బంగ్లాదేశ్లో జరగబోయే ఎన్నికల మధ్య సంబంధం గురించి ప్రశ్నించగా.. సాజీబ్ వాజేద్ దానిని ధ్రువీకరించారు. "ఖచ్చితంగా. వారు చేసింది ఏమిటంటే, వారు నా తల్లిని దోషిగా ప్రకటించారు. ఆ తర్వాత, నిందితులుగా ఉన్న ఎవరూ ఎన్నికలలో పాల్గొనకుండా ఉండేందుకు వారు మళ్లీ చట్టాన్ని మార్చారు. ఇది సరైన ప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించడమే. అందుకే వారు ఆమెకు ఈ శిక్షను హడావుడిగా విధించవలసి వచ్చింది. వారు మా పార్టీ అవామీ లీగ్ను కూడా ఎన్నికల నుంచి నిషేధించారు. అక్కడ ఎటువంటి ప్రజాస్వామ్యం లేదు." అని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజేద్ స్పష్టం చేశారు.
-
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications