నా తల్లిని టచ్ కూడా చేయలేరు: షేక్ హసీనా తనయుడి సంచలనం!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు స్థానిక ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షేక్ హసీనా కుమారుడు, అవామీ లీగ్ సభ్యుడు సాజీబ్ వాజేద్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ (ICT) తన తల్లికి ఇచ్చిన మరణశిక్ష నిర్ణయాన్ని చట్టవిరుద్ధం, ఒక జోక్గా అభివర్ణించారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో యూనుస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ప్రభుత్వానికి ఎటువంటి ఎన్నికల మద్దతు లేదు, అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం. వారు ఈ ట్రిబ్యునల్ నుంచి 17 మంది న్యాయమూర్తులను తొలగించారు. ట్రయల్ బెంచ్లో ఎటువంటి అనుభవం లేని కొత్త న్యాయమూర్తిని నియమించారు. ఆ న్యాయమూర్తి బహిరంగంగా నా తల్లి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడారు. ఆయన స్పష్టంగా పక్షపాతంతో ఉన్నారు" అని వాజేద్ ఆరోపించారు.
యూనుస్ నా తల్లిని తాకలేరు..
మరణశిక్ష ప్రకటించిన తర్వాత మహ్మద్ యూనుస్ షేక్ హసీనాను చంపడానికి ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్నకు సాజీబ్ వాజేద్ బదులిస్తూ.. "లేదు, వారు ఆమెను చంపలేరు. వారు శిక్షను ఎలా అమలు చేయగలరు? మొదటిది, వారు ఆమెను పట్టుకోలేరు. రెండోది, చట్ట పాలన తిరిగి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. యూనుస్ నా తల్లిని తాకలేరు" అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు
సాజీబ్ వాజేద్ ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. "నేను ప్రధానమంత్రి మోదీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన నా తల్లి భద్రతను నిర్ధారించారు. ఆయన నా తల్లి ప్రాణాలను కాపాడారు. ఒక దేశాధినేతగా, ఆయన నా తల్లికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. దీనికి నేను భారత ప్రభుత్వానికి, భారతదేశ ప్రజలకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను," అని సాజీబ్ వాజేద్ పేర్కొన్నారు.
అప్పగింత సాధ్యం కాదు..
షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించడం గురించి అడిగినప్పుడు.. సాజీబ్ వాజేద్ ఇలా అన్నారు. "ఎవరినైనా అప్పగించడానికి, ఒప్పందంతో పాటు చట్టం ఉండాలి. మొదటిది, చట్టబద్ధమైన ప్రభుత్వం ఉండాలి, కానీ ఇక్కడ లేదు. రెండోది, సరైన ప్రక్రియ పాటించాలి, కానీ అది పాటించలేదు. ఆ ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలి, కానీ బంగ్లాదేశ్లో ఆ ప్రక్రియ పూర్తిగా చట్టవిరుద్ధం. కాబట్టి నా తల్లిని అప్పగించడం సాధ్యం కాదు." అని ఆయన అన్నారు.
ఎన్నికలతో మరణశిక్షకు సంబంధం
షేక్ హసీనాకు మరణశిక్ష విధించడం, బంగ్లాదేశ్లో జరగబోయే ఎన్నికల మధ్య సంబంధం గురించి ప్రశ్నించగా.. సాజీబ్ వాజేద్ దానిని ధ్రువీకరించారు. "ఖచ్చితంగా. వారు చేసింది ఏమిటంటే, వారు నా తల్లిని దోషిగా ప్రకటించారు. ఆ తర్వాత, నిందితులుగా ఉన్న ఎవరూ ఎన్నికలలో పాల్గొనకుండా ఉండేందుకు వారు మళ్లీ చట్టాన్ని మార్చారు. ఇది సరైన ప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించడమే. అందుకే వారు ఆమెకు ఈ శిక్షను హడావుడిగా విధించవలసి వచ్చింది. వారు మా పార్టీ అవామీ లీగ్ను కూడా ఎన్నికల నుంచి నిషేధించారు. అక్కడ ఎటువంటి ప్రజాస్వామ్యం లేదు." అని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజేద్ స్పష్టం చేశారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications