శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదం: కుడిగట్టు ప్లాంట్ భద్రతపై ప్రశ్నలు, ఇంజినీర్లు మాత్రం..
శ్రీశైలం ఎడమగట్టున గల పవర్ ప్లాంట్ ప్రమాదంతో 9 మంది చనిపోయారు. దీంతో కుడిగట్టున గల పవర్ ప్లాంట్ భద్రతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే కుడిగట్టు సేఫ్ అని ఇంజినీర్లు చెబుతున్నారు. ఎడమగట్టు భూగర్భంలో ఉండగా.. కుడిగట్టు ఉపరితలంపై ఉండటమే అని వివరిస్తున్నారు. గతంలో ప్రమాదం జరిగినా, నీట మునిగినా ప్రాణనష్టం మాత్రం సంభవించలేదు అని చెబుతున్నారు.

కుడివైపు ప్లాంట్ భద్రతపై ప్రశ్నలు
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున తెలంగాణ విద్యుదుత్పత్తి ప్లాంటు ఉంది. కుడివైపున గల ప్లాంటు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. ఎడమ గట్టు పవర్ ప్లాంట్ 20 ఏళ్ల కింద నిర్మించారు. కానీ కుడిగట్టు కేంద్రాన్ని 40 ఏళ్ల కింద ఏర్పాటు చేశారు. ఈ రెండు పవర్ ప్లాంట్ సాగు నీరు అందించేందుకు దోహపదపడుతున్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి కూడా సృష్టిస్తున్నారు.

భారీ ప్రమాదం..
గురువారం రాత్రి జరిగినా ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ జరగలేదు. దీంతో కుడిగట్టు భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎడమ గట్టు ప్రాజెక్టుతో పోల్చితే కుడిగట్టు కేంద్రం భద్రమైనదని ఇంజనీర్లు తెలిపారు. ఎడమగట్టు ప్లాంటు భూగర్భంలో రెండు కిలోమీటర్ల లోతులో టర్బైన్లు ఉన్నాయి కుడిగట్టు మాత్రం ఉపరితలంలో ఉంది. టర్బైన్లు 150 అడుగులలో ఉన్నాయి. ఎడమగట్టు ప్లాంటు ప్రమాదంలో జీరో లెవల్లో మంటలు ప్రారంభమై.. పైన గల సర్వీస్ డే వరకు దట్టమైన పొగ అలుముకుంది. కింది నుంచి పైకి మంటలు, పొగ వేగంగా వ్యాపించింది. దీంతో అందులో ఉన్న ఉద్యోగులు/ సిబ్బంది వేగంగా రాలేకపోయారు.

లోపలికి వెళ్లేందుకు వీలుపడని వైనం
ప్రమాదాన్ని గుర్తించినా బయట వ్యక్తులు లోపలికి వెళ్లలేకపోయారు. సహాయ చర్యలు కూడా ఆటంకం కలిగింది. అయితే కుడిగట్టు ప్లాంటు ఉపరితలంలో ఉన్నందున ప్రమాదం జరిగినా తీవ్రత ఈ స్థాయిలో ఉండదని ఇంజినీర్లు పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం కుడిగట్టు ప్లాంట్లో మంటలు చెలరేగాయి. కానీ వెంటనే వాటిని ఆర్పివేయగలిగారు. భూ ఉపరితలంపై ఉండటమే అని చెబుతున్నారు. స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించిన కేంద్రంలో సాంకేతిక సమస్య వస్తే సైరన్ల ద్వారా సంకేతాలు వెలువడతాయి.
Recommended Video

వరదలొచ్చినా.. ఆస్తినష్టమే..
11 ఏళ్ల క్రితం వచ్చిన భారీ వరదలకు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నీట మునిగింది. శ్రీశైలం డ్యామ్ గేట్ల ద్వారా 25 లక్షల క్యూసెక్కులను కిందికి వదిలేయాల్సి వచ్చింది. పవర్ హౌస్కు ఆనుకొని ఉన్న రక్షణగోడ బద్దలై వరద నీరు లోపలికి చేరింది. అప్పుడు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. కానీ భారీగా ఆస్తినష్టం మాత్రం సంభవించింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications