హైదరాబాద్: ముంబై టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య డిసెంబర్ 8న ముంబైలోని వాంఖడె స్టేడియంలో ప్రారంభమైన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్పై టీమిండియా ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. టెస్టుల్లో భారత్కు ఇది 135వ గెలుపు కావడం విశేషం.
ఇంగ్లాండ్పై భారత్కు ఇది 24వ టెస్టు విజయం. ఈ టెస్టు సిరిస్తో టీమిండియా వరుసగా ఐదు టెస్టు సిరిస్లను కైవసం చేసుకుంది. దీంతో ఐదు టెస్టుల మ్యాచ్ల సిరిస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరిస్ను భారత్ కైవసం చేసుకుంది. ముంబై టెస్టు విజయంతో ఇంగ్లాండ్పై టీమిండియా 0-3 ఆధిక్యంలో నిలిచింది.
భారత్-ఇంగ్లాండ్ నాలుగో టెస్టు మ్యాచ్ ఫోటోలు
ఈ టెస్టుతో తన టెస్టు కెరీర్లో 24వ సారి అశ్విన్ 5 వికెట్లను తీసుకున్నాడు. దీంతో టెస్టుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డుని అశ్విన్ అధిగమించాడు. ముంబై టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అశ్విన్ 12 వికెట్లు తీశాడు. టెస్టులో చివరి రోజైన సోమవారం 182/6 ఓవర్ నైట్ స్కోరుతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది.
మ్యాచ్ ఆరంభంలోనే స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెయిర్ స్టోను పెవిలియన్కు పంపాడు. అర్ధసెంచరీ పూర్తి చేసిన బెయిర్ స్టో 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ వెంటనే వోక్స్ (0)ను కూడా అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎక్కవ సేపు సాగలేదు.
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ను అధిగమించే క్రమంలో ఇంగ్లాండ్ చేతిలో రెండు వికెట్లతో పాటు ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది. ఈ సమయంలో అశ్విన్ వరుస ఓవర్లలో రషీద్, ఆండర్సన్ లను పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. భారత్ ఘనవిజయం సాధించింది.
మ్యాచ్ తీరు సాగిందిలా:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 400
భారత్ తొలి ఇన్నింగ్స్: 631
తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆధిక్యం 231
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 195 ఫరుగులకే ఆలౌట్
మ్యాచ్ ఫలితం: ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
3-0 Jai Ho #TeamIndia #INDvENG pic.twitter.com/UeB8LDD8Kj
— BCCI (@BCCI) December 12, 2016