మొండిచెయ్యి కాదు తెలంగాణకు కేంద్రం ఉత్త చెయ్యి..
మొండిచెయ్యి చూపడంలో రెండు తెలుగు రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తోంది మోడీ సర్కార్. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి మొండిచేయి చేపిన కేంద్రం, తెలంగాణకు సంబంధించిన హామీల విషయంలోను అదే ధోరణితో వ్యవహరిస్తోంది. కేంద్రం దీనిపై అధికార ప్రకటన కూడా చేయడంతో తెలంగాణకు అన్యాయం జరిగినట్టేనన్న వాదన వినిపిస్తోంది.
విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా.. దీనిపై తాజాగా మాట మార్చిన ప్రభుత్వం ఆర్థిక కారణాల రీత్యా ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని తెలంగాణకు షాక్ ఇచ్చింది. లిఖితపూర్వకంగా దీనిపై సమాధానం వెలువరించిన కేంద్రం తెలంగాణకు సంబంధించిన మరిన్ని విషయాల్లోను కోత పెట్టింది.

విభజన హామీల ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన వాటిల్లో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఒకటి. కానీ తాజా ప్రకటన ద్వారా తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ను కూడా హామీల నుంచి తప్పించే ప్రయత్నం చేసింది కేంద్రం. ట్రాఫిక్ డిమాండ్ ను సాకుగా చూపి దీనికి అనుకూలంగా ఉంటేనే రైలు ఏర్పాటు సాధ్యమవుతుందని కుండబద్దలు కొట్టింది. మొత్తానికి కేంద్రం తాజా ప్రకటన మొండిచేయిని కాదు, తెలంగాణ ఉత్త చెయ్యినే ఊపినట్టయిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. మరి ఈ విషయంలో కేంద్రంపై తెలంగాణ ఎంపీలు ఏవిధంగా ఒత్తిడి తెస్తారో చూడాలి.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications