రేవ్ పార్టీల్లోనూ డ్రగ్ టాబ్లెట్లు! అమ్మాయిలకు బ్లూ, అబ్బాయిలకు పింక్!!
డ్రగ్స్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఈ కేసులో రోజురోజుకి వెల్లడవుతున్న విషయాలు చూసి విస్తుబోతున్నారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఈ కేసులో రోజురోజుకి వెల్లడవుతున్న విషయాలు చూసి విస్తుబోతున్నారు. రిసార్ట్స్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తూ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు.
అంతేకాదు, ఈ రేవ్ పార్టీల కోసం ముంబై, గోవా, ఢిల్లీ, నైజీరియా వంటి ఆఫ్రికా దేశాల యువతులను మాఫియా గ్యాంగ్ లు రప్పిస్తూ వ్యభిచారాన్ని కూడా నిర్వహిస్తున్నారనే సమాచారం కూడా అందింది.
రేవ్ పార్టీలలో ఎంపిటోమైన్ తో తయారుచేసిన ట్యాబ్లెట్స్ ను డ్రగ్ మాఫియా అందిస్తోంది. ఈ ట్యాబ్లెట్స్ ను స్త్రీలకు వేరుగా, పురుషులకు వేరుగా తయారు చేయడం విశేషం. అమ్మాయిలకు బ్లూ (నీలిరంగు) కలర్, అబ్బాయిలకు పింక్ (గులాబీ రంగు) కలర్ ట్యాబ్లెట్స్ ను ఇస్తారు.
విదేశీ యువతులతో ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేందుకు ఈ ట్యాబ్ లెట్స్ ను వినియోగిస్తున్నట్లు విచారణాధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ కు ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది.
పాత కస్టమర్లు రిఫరెన్స్ ఇస్తేనే కొత్తవారికి ఈ డ్రగ్ టాబ్లెట్లు సరఫరా చేస్తారు. ఈ డ్రగ్స్ ను నేరుగా మాఫియాలోని వ్యక్తులే సరఫరా చేస్తూ.. కొత్తవారికి తెలిసే అవకాశం లేకుండా జాగ్రత్తపడుతున్నారని కూడా విచారణాధికారులు గుర్తించారు.