కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహేతర సంబంధం: భార్య, ప్రియుడిపై దాడి

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: జిల్లాలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఆమెతోపాటు ఆమె ప్రియుడిపైనా దాడి చేశాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మణుగూరు మండలం కమలాపురానికి చెందిన కంపెర్ల గోవర్ధన్, ధనమ్మ(35) భార్యాభర్తలు. కాగా, ఇంటి పక్కనే ఉండే పొనగంటి కృష్ణతో ధనమ్మ కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఎనిమిది నెలల క్రితం వీరిద్దరూ ఊరు విడిచి వెళ్లిపోయారు. కొద్దిరోజుల కిందట గ్రామానికి వచ్చి గోవర్ధన్ ఇంటిపక్కనే ఉంటున్నారు. కాగా, ఆదివారం రాత్రి కృష్ణ, ధనమ్మ ఆరుబయట నిద్రస్తుండగా గోవర్ధన్ రోకలిబండతో దాడిచేసి పరారయ్యాడు. దాడిలో ధనమ్మ మృతిచెందగా, కృష్ణ పరిస్థితి విషమంగా ఉంది.

Extramarital affair: A man murdered his wfie

అదనపు కట్నం కోసం భార్యను కడతేర్చిన భర్త

అదనపు కట్నం కోసం ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యనే హతమార్చాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా మంథనిలో చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసమే భార్యను చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు చంద్రమోహన్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

English summary
A man has allegedly murdered his wife for extramarital affair in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X