వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం మత్తులో తండ్రిని చంపి, తల్లి ని గాయపరిచిన కొడుకు

మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవపడి గొడ్డలితో తనయుడు దాడి చేయగా తండ్రి మల్లెల నాగయ్య (50) మృతిచెందగా తల్లి మల్లెల సావిత్రి (47) పరిస్థితి విషమంగా ఉంది.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవపడి గొడ్డలితో తనయుడు దాడి చేయగా తండ్రి మల్లెల నాగయ్య (50) మృతిచెందగా తల్లి మల్లెల సావిత్రి (47) పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన గ్రామ పంచాయతీ మోదెడులో చోటు చేసుకుంది. వివరాల్లో వెళ్లితే పలిమెల ఎస్సై నరేష్‌ కథనం మేరకు.. మల్లెల సావిత్రికి 17 సంవత్సరాల క్రితం వివాహమయింది. ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మల్లెల నాగయ్యను వివాహం చేసుకుంది. ఈ క్రమంలో వ్యవసాయం చేస్తూ వీరంతా జీవనం సాగిస్తున్నారు.

నాగయ్య సావిత్రి మొదటి సంతానం కుమారుడు ప్రభాకర్‌తో తరుచూ గొడవ పడుతుండే వాడు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ప్రభాకర్‌ మద్యం మత్తులో తండ్రితో గొడవ పడ్డాడు. క్షణాకావేశంలో గొడ్డలితో నరకిచంపాడు. తల్లి అడ్డు రావడంతో గొడ్డలితో దాడి చేయగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

Father was killed by son

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అంబులైన్స్‌ ద్వారా మహదేవపూర్‌ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ఆమెను వరంగల్‌ ఎంజీఎమ్‌కు తరలించారు.

నాగయ్య మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం మహదేవపూర్‌కు తరలించారు. గ్రామ సర్పంచు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

English summary
Father Was killed by son in Jayashankar Bhupalapalli district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X