'మోడీ-కేసీఆర్ చీకటి ఒప్పందం: కేసీఆర్ బ్లాక్ మనీ ఎంతుందో..'
కేసీఆర్-మోడీ మధ్య జరిగిన భేటీని చీకటి ఒప్పందంగా అభివర్ణించారు జీవన్ రెడ్డి.
హైదరాబాద్ : ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మూడు రోజుల క్రితం వీరిద్దరి మధ్య జరిగిన భేటీపై ఆయన పలు అనుమానాలు లేవనెత్తారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని నల్లధనంపై మోడీ వైఫల్యంగా అభివర్ణించారు జీవన్ రెడ్డి.
కేసీఆర్-మోడీ మధ్య జరిగిన భేటీని చీకటి ఒప్పందంగా అభివర్ణించారు జీవన్ రెడ్డి. తనవద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకే మోడీతో కేసీఆర్ భేటీ అయ్యారని ఆయన ఆరోపించారు.త్వరలోనే కేసీఆర్ వద్ద బ్లాక్ మనీ ఎంతుందో లెక్క తేలుతుందని చెప్పిన ఆయన.. కేసీఆర్ అతిపెద్ద అవినీతిపరుడని ఆరోపించారు.

ఇక మోడీ గురించి ప్రస్తావిస్తూ.. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి రప్పించలేకనే.. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని మోడీని విమర్శించారు. నోట్ల రద్దు కారణంగా.. దేశవ్యాప్తంగా సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెట్టారు జీవన్ రెడ్డి.












Click it and Unblock the Notifications